శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 అక్టోబరు 2022 (12:27 IST)

విజయవాడలో బాలికపై అత్యాచారం.. గర్భందాల్చడంతో వెలుగులోకి...

victim
విజయవాడ నగరంలో మరో బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. స్నేహం పేరుతో పరిచయం పెంచుకున్న ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నగరంలోని బెంజి సర్కిల్‌ ప్రాంతానికి చెందిన నిందితుడు సాయి బాధిత బాలిక (14)తో స్నేహం పేరుతో పరిచయం పెంచుకున్నాడు. ఈ యేడాది మే నెలలో బాలికను తన బైక్‌పై ఎక్కించుకుని పటమట జిల్లా పరిషత్ పాఠశాల సమీపంలోని ఓ భవనంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
మరో రెండు రోజుల తర్వాత మరో భవనంలోకి తీసుకెళ్లిన సాయి.. తన స్నేహితులు బబ్లు, ప్రకాశ్‌లను అక్కడికి పిలిపించి, వారంతా కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాలికను తీసుకొచ్చి ఇంటివద్ద వదిలిపెట్టారు. 
 
అయితే, గత కొన్ని రోజులుగా బాలిక శరీరంలో మార్పులు రావడాన్ని గమనించిన తల్లదండ్రులు నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వైద్యుల వద్దకు తీసుకెళ్లగా ఆ బాలిక ఆరు నెలల గర్భవతిగా తేల్చారు. 
 
బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.