సెంట్రల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీ-టెట్) పరీక్ష వాయిదా

శుక్రవారం, 17 డిశెంబరు 2021 (11:28 IST)
దేశ వ్యాప్తంగా నిర్వహించే సెంట్రల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీ టెట్) పరీక్షను వాయిదా వేశారు. ఆన్‌లైన్ ద్వారా నిర్వహించే ఈ పరీక్షలు గురువారం నుంచే ప్రారంభమయ్యాయి. కానీ, ఆన్‌లైన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఈ పరీక్షల నిర్వహణను వాయిదావేశారు. అయితే, ఈ పరీక్షలను తిరిగి ఎపుడు నిర్వహిస్తారన్న అంశంపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. 
 
దేశంలోని ప్రధాన పట్టణాల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో ఈ టెస్ట్‌ను దశలవారీగా వచ్చే యేడాది జనవరి 13వ తేదీ వరకు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. మొదటి రోజున పేపర్-2 పరీక్షలోని సర్వర్‌లో సమస్య తలెత్తింది. ఇది సాయంత్రం 4 గంటలైనా పరిష్కారం కాకపోవడంతో పరీక్షను వాయిదా వేశారు. అలాగే, శుక్రవారం, శనివారం ఉదయం, శనివారం నిర్వహించే పరీక్షలను కూడా రద్దు చేశారు. 
 
కాగా, సీ-టెట్‌తో కేంద్రీ విద్యాలయం, సైనిక్ స్కూల్స్, నవోదయ స్కూల్స్ కేంద్ర ప్రభుత్వానికి చెందిన పాఠశాలల్లో విద్యా బోధనకు సీ-టెట్‌ను ప్రామాణికంగా భావిస్తారు. దేశ వ్యాప్తంగా ఈ పరీక్ష కోసం ప్రతి యేడాది ఎంతో మంది ఎదురు చూస్తుంటారు. 

అన్నీ చూడండి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments