జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు రిలీజ్ - విజయవాడ విద్యార్థికి ఆరో ర్యాంకు

ఆదివారం, 11 సెప్టెంబరు 2022 (13:35 IST)
ఉమ్మడి ప్రవేశ పరీక్ష అడ్వాన్స్‌డ్ (జేఈఈ అడ్వాన్స్‌డ్‌) ఫలితాలను ఆదివారం విడుదల చేశారు. ఐఐటీల్లో బీటెక్‌, బ్యాచులర్‌ ఆఫ్‌ సైన్స్‌(బీఎస్‌) సీట్ల భర్తీకి గత నెల 28వ తేదీన నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఫలితాలను ఐఐటీ బాంబే విడుదల చేసింది. విజయవాడకు చెందిన పొలిశెట్టి కార్తికేయకు 6వ ర్యాంకు వచ్చింది.
 
ఫలితాలు విడులైన నేపథ్యంలో రేపటి నుంచి ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ(జోసా) కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుంది. 
 
దేశంలోని 23 ఐఐటీల్లో మొత్తం 16,598 సీట్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. వీటిలో బాలికలకు 1,567 సీట్లను సూపర్‌ న్యూమరరీ కింద కేటాయిస్తారు. ఐఐటీల్లో అత్యధికంగా 2,129 మెకానికల్‌ ఇంజినీరింగ్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం సీట్లలో ఇవి సుమారు 13 శాతం. ఐదేళ్ల డ్యూయల్‌ డిగ్రీ సీట్లనూ కలిపితే అది 14 శాతానికి పెరుగుతుందని విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి. 

అన్నీ చూడండి

Raka Fans Title: అల్లు అర్జున్ .. రాకా చిత్ర యానిమేటెడ్ టైటిల్ కు స్పందన

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ .. పంజ 4Kలో థియేటర్లలోకి తిరిగి వస్తోంది

Peddi: రామ్ చరణ్ తో ఐటెంసాంగ్ లో అలరించిన శృతి హాసన్, జాన్వీ కపూర్

హాలీవుడ్ క‌ల‌ర్స్‌ రియలిస్టిక్‌, ఇండియ‌న్ క‌ల‌ర్‌ ఎమోష‌న‌ల్‌, క‌ల్చ‌ర‌ల్లీ రిచ్‌ : కిషోర్ బోయిడాపు

Sri Satya: బిగ్ బాస్'ఫేమ్ శ్రీ సత్య ఆవిష్కరించిన విహారి OTT గ్లోబల్ విజన్

తర్వాతి కథనం
Show comments