Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారులో యువతిపై నలుగురు టెక్కీల అత్యాచారయత్నం

Written By ఠాగూర్
Updated: గురువారం, 25 నవంబరు 2021 (11:44 IST)
చెన్నై నగరంలో ఓ దారుణం జరిగింది. ఒక యువతిపై నలుగురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు అత్యాచారా యత్నానికి పాల్పడ్డారు. అదీ కూడా కదులుతున్న కారులో ఈ దారుణానికి ఒడిగట్టారు. దీంతో ఆ యువతి కేకలు వేయడంతో  రాత్రిపూట గస్తీ పోలీసులు గుర్తించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, నగరానికి చెందిన ఒక యువతి మరో నలుగురు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు దురైప్పాక్కంలోని ఒక ఐటీ కంపెనీలో టెక్కీలుగా పని చేస్తున్నారు. వీరంతా కలిసి ఒక నక్షత్ర హోటల్‌లో మందుపార్టీ చేసుకున్నారు. అర్థరాత్రి వరకు పీకలదాకా మద్యం సేవించారు. 
 
ఆ తర్వాత తెల్లవారుజామున తమతమ ఇళ్లకు వెళ్లేందుకు అందరూ కలిసి ఒక కారులో బయలుదేరారు.  ఆ కారు హోటల్‌ను వీడి ప్రధాన రహదారి పైకి వెళ్లిన తర్వాత ఆ యువతిపై నలుగురు స్నేహితులు అత్యాచారం చేసేందుకు యత్నించారు. దీంతో ఆ యువతి బిగ్గరగా కేకలు వేసింది. 
 
ఆ సమయంలో రోడ్లపై గస్తీ తిరుగుతున్న పెట్రోలింగ్ పోలీసులు ఈ విషయాన్ని గమనించి కారును, అందులోని టెక్కీలతో పాటు యువతిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక థౌజండ్ లైట్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

అన్నీ చూడండి

హుషారు పిట్టలు, బిగ్ స్క్రీన్ పైన తనను తను చూసుకుని చెంప పగలగొట్టుకున్న నటుడు, వీడియో వైరల్

వారి వల్లే 'చెన్నై లవ్ స్టోరీ రూ. 50 కోట్ల గ్రాసర్ గా నిలిచింది - సాయి రాజేష్

హుషార్‌ పిట్టలు సెకండాఫ్‌లో నాలుగు సార్లు ఏడ్చాను : చరణ్‌ అర్జున్‌

అనకాపల్లి మూవీ విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా: సోనూ సూద్

Varun: సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలంటే ప్రమోషన్స్ వినూత్నంగా చేయాలి : వరుణ్ తేజ్

తర్వాతి కథనం
Show comments