సూప్‌లో అనుకోకుండా ఉప్పు ఎక్కువయ్యిందా..?

మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (17:14 IST)
కొత్తిమీర, కరివేపాకులు ఒక్కరోజులోనే వాడిపోతుంటాయి. అలా కనుక ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు వాటిని మెత్తగా పేస్ట్ మాదిరిగా నూరుకుని ఉండలుగా చేసుకుని వాటికి కొద్దిగా ఉప్పు జోడించి డబ్బాలలో నిల్వచేసుకుంటే.. మళ్లీ ఎప్పుడైనా కూరల్లో, సాంబారుల్లో వాడుకోవచ్చు. ఎక్కువకాలం నిల్వవుంటాయి. అల్లం. పచ్చిమిర్చి కూడా అలానే మెత్తగా రుబ్బుకుని వాటిని ఉండలుగా చేసి ఉప్పు వేసి నిల్వచేసుకోవచ్చు.
 
1. ఖాళీ అయిన నెయ్యి లేదా నూనె ప్యాకెట్లలో పప్పులు నిలువ చేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ధనియాలు పురుగు పట్టకుండా ఉండాలంటే వాటిని బాణలిలో కాసేపు వేడిచేసి ఆపై డబ్బాలో నిల్వచేస్తే చాలాకాలం వరకు నిల్వ ఉంటాయి. 
 
2. పప్పులు, ఉప్పులు వేసుకునే సీసాలు మురికిగా ఉన్నట్లైతే.. బంగాళాదుంప తొక్కల్ని వాటిలో వేసి కాసిన్ని నీళ్లుపోసి బాగా కలిపి ఆ తర్వాత నీటితో కడిగితే జిడ్డంతా తొలగిపోతుంది. అలానే కర్పూరం త్వరగా కరిగిపోకుండా ఉండాలంటే.. కర్పూరం డబ్బాలో అడుగుభాగాన కొన్ని బియ్యపు గింజలను వేస్తే కరగకుండా ఉంటాయి. 
 
3. సూప్‌లో అనుకోకుండా ఉప్పు ఎక్కువయ్యిందా.. సగం తరిగిన బంగాళదుంప ముక్కను సూప్‌లో వేయండి. 15 నిమిషాల తరువాత తక్కువ మంటమీద సూప్‌ను వేడిచేస్తే ఉప్పును పీల్చేస్తుంది. ఆపై బంగాళదుంపను తీసేయొచ్చు.
 
4. పుదీనా, మిరియాలపొడి వంటి వాటిని సూప్‌‍లలో ఎక్కువగా చేర్చండి. అప్పుడు ఉప్పు తక్కువ పడుతుంది. మంచి రుచితోపాటు బలవర్థకం కూడా. సూప్‌లు చిక్కగా రావాలంటే.. మీకు నచ్చిన కూరగాయల్ని ఉడికించి తరువాత మిక్సీలో వేసి గ్రైండ్ చేయండి. ఈ మిశ్రమాన్ని సూప్‌లో కలిపితే చాలా బాగుంటుంది.
 
5. ఎక్కువ రోజుల నుండి వాడుతున్న వంటసోడా సరిగ్గా ఉందో లేదో తెలుసుకోవాలంటే.. ఇలా చేయండి.. ఒక పాత్రలో నీటిని బాగా మరిగించి అందులో కొద్దిగా వంటసోడా వేయండి. నీటిలో వెంటనే బుడగలు వస్తే అది చక్కగా పనికొస్తుందని అర్థం.
 
6. ఆకుకూరలు, కూరగాయలను కడిగేటప్పుడు నీళ్ళల్లో చిటికెడు వంటసోడా చేరిస్తే.. వండిన తర్వాత ఆకుకూరలు రంగు మారకుండా ఉంటాయి. అంతేకాదు కుళాయి నుండి పట్టిన నీళ్లలో సూక్ష్మక్రిములు ఉంటే కూడా తొలగిపోతాయి. 

అన్నీ చూడండి

మహిళా పారిశ్రామికవేత్తలతో ప్రతి మూడు నెలలకోసారి సమావేశం నిర్వహిస్తా: సీఎం రేవంత్ రెడ్డి

Vizag: 1.7 కిలోల బరువున్న శిశువుకు అరుదైన మెదడుకు శస్త్ర చికిత్స

కార్గిల్ విజయ్ దివస్ 2026: జావా, యెజ్డీలపై రైడర్లతో శౌర్య విజయ్ యాత్రను ప్రారంభించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్

అలా నిరూపిస్తే కచ్చితంగా రాజకీయాలకు స్వస్తి పలుకుతాను.. కేటీఆర్

చంద్రాయణగుట్టలో లైసెన్స్ లేని మందులు

అన్నీ చూడండి

New Delhi: 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల ప్రకటన వెలువడింది

L.B. Sriram: ఆలస్యంగా గుర్తించినందుకు అవమానంగా ఉంది : ఎల్. బి. శ్రీరామ్

Ali: బద్రి లోని హే చికీతా పాట పెద్ద హిట్ అయిందో ఈ సినిమా హిట్ : అలీ

Soori: సుహాస్, సూరి నటించిన మండాడి చిత్రాన్ని విడుదలచేస్తున్న మైత్రి డిస్ట్రిబ్యూటర్స్

న్యూటన్స్ థర్డ్ లా' చాలా కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే థ్రిల్లర్ : సుమంత్

తర్వాతి కథనం
Show comments