Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాలో కరోనా విజృంభణ - 1555 పాజిటివ్ కేసులు

Written By ఠాగూర్
Updated: గురువారం, 9 జులై 2020 (16:14 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఫలితంగా గత 24 గంటల్లో ఏకంగా 1555 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఏపీ నుంచి 1,500 కేసులు నమోదు కాగా... 53 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో, రెండు కేసులు ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో నమోదయ్యాయి. 
 
24 గంటల్లో అత్యధికంగా కేసులు నమోదైన జిల్లాల్లో చిత్తూరు (236), గుంటూరు (228), విశాఖ (208), శ్రీకాకుళం (206) ముందు వరుసలో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో కృష్ణా, కడప, ప్రకాశం, అనంతపురం జిల్లాలు ఉన్నాయి.  
 
మరోవైపు గత 24 గంటల్లో 13 మంది కరోనా కారణంగా చనిపోయారు. 904 మంది ఆసుపత్రుల్లో కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుత కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,814కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 277కి చేరుకుంది.
 
ఇప్పటివరకు ఆయా జిల్లాల్లో ఉన్న యాక్టివ్ కేసుల వివరాలను పరిశీలిస్తే, అనంతపూరం 984, చిత్తూరు 986, ఈస్ట్ గోదావరి 1406, గుంటూరు 1355, కడప 958, కృష్ణ 725, కర్నూలు 1087, నెల్లూరు 465, ప్రకాశం 314, శ్రీకాకుళం 504, విశాఖపట్టణం 634, విజయనగరం 210, వెస్ట్ గోదావరి 916 చొప్పున ఉన్నాయి. 

అన్నీ చూడండి

మానసిక ప్రశాంతత కోసం సోషల్ మీడియా గుడ్‌బై... 'ప్రేమలు' బ్యూటీ వెల్లడి

'వారణాసి' నుంచి కీలక అప్‌డేట్ - 'రుద్ర' ఫస్ట్‌లుక్ రిలీజ్

Toxic: trailer: బోల్డ్, రా, వైల్డ్, క్రేజీ, అంశాలతో యష్..కియారా అద్వానీ చిత్రం టాక్సిక్: ట్రైలర్

Allari Naresh: కీలక సన్నివేశాల చిత్రీకరణలో రంభ ఊర్వశి మేనక

తొలిరోజే రూ.10.2 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన కొరియన్ కనకరాజు

తర్వాతి కథనం
Show comments