ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. నిన్నమొన్నటివరకు చక్రం తిప్పిన సలహాదారుల అధికారాలను ఇపుడు పూర్తిగా కత్తిరించేశారు. ముఖ్యంగా, ఇప్పటివరకు సీఎంవోలో కీలక బాధ్యతలను నిర్వహించిన అజేయ కల్లాం, పీవీ రమేశ్, జే.మురళిని తప్పించారు. వీరి బాధ్యతలను ప్రవీణ్ ప్రకాశ్, సాల్మన్ ఆరోఖ్య రాజ్, ధనుంజయ్ రెడ్డిలకు బదలాయించారు. ప్రవీణ్ ప్రకాశ్కు జీఏడీ, హోం, రెవెన్యూ, ఫైనాన్స్, న్యాయశాఖ, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, సీఎం డ్యాష్...