suvichar

యాదగిరిగుట్ట ఠాణా పోలీసులపై కరోనా పంజా

Written By ఠాగూర్
Updated: సోమవారం, 17 జనవరి 2022 (12:46 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రస్థాయికి చేరింది. రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఈ వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా, ఆ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలైన ఆంక్షలను అమలు చేస్తుంది. అయినప్పటికీ అనేక మంది ప్రముఖులు ఈ వైరస్ బారినపడుతున్నారు. 
 
తాజాగా భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని పోలీస్ ఠాణాపై కరోనా పంజా విసిరింది. ఈ స్టేషన్‌‌లో పనిచేసే పోలీసుల్లో ఏకంగా 12 మందికి ఈ వైరస్ సోకింది. వీరిలో యాదగిరిగుట్ట ఏసీపీ, సీఐ, పది మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరందరికీ పాజిటివ్‌గా తేలడంతో వారిని హోం క్వారంటైన్‌కు తరలించారు. 
 
దేశ వ్యాప్తంగా వైరస్ విజృంభిస్తుండగంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని వారు సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులను తప్పనిసరిగా ధరించాలని, కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. 

అన్నీ చూడండి

Avengers: Endgame : అవెంజర్స్: ఎండ్‌గేమ్ – ఎన్‌కోర్ : బుకింగ్స్ ఓపెన్

వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం ఆదర్శ కుటుంబం టీజర్ వాయిదా

తస్సదియ్యా పాట సమయంలో సమంత ప్రెగ్నెంట్ న్యూస్ వచ్చింది.. మాతృత్వంపై...?

త్రివిక్రమ్ సమర్పణలో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్ అంశ్ రాబోతోంది

బాలికలకు హెచ్ పీవీ వ్యాక్సిన్ పై అవగాహన కల్పించిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్

తర్వాతి కథనం
Show comments