ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా.. 24 గంటల్లో 348 కేసులు

బుధవారం, 10 నవంబరు 2021 (23:04 IST)
ఆంధ్రప్రదేశ్‌లో రోజువారి కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో 41,244 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 348 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మరో ముగ్గురు కోవిడ్ బాధితులు మృతిచెందారు.. చిత్తూరు, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు మృతిచెందినట్టు బులెటిన్‌లో పేర్కొంది ఏపీ సర్కార్. ఇదే సమయంలో 358 మంది కోవిడ్‌ బాధితులు కోలుకున్నారు.
 
ఇక, ఇవాళ్టి టెస్ట్‌లతో కలుపుకొని రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,98,46,690కు చేరింది. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,69,066కు పెరిగగా.. ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో కోలుకున్నవారి సంఖ్య 20,51,440కి చేరింది.. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 3,220గా ఉంటే.. మృతుల సంఖ్య 14,406కు పెరిగింది. మరోవైపు, తాజా కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరిలో 69, చిత్తూరులో 52 కేసులు వెలుగుచూశాయి.

అన్నీ చూడండి

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments