బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు కరోనా

మంగళవారం, 26 జులై 2022 (13:02 IST)
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు మరోమారు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన వైద్య సలహా మేరకు వైద్యం చేయించుకుంటున్నారు. ఇటీవలి కాలంలో దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో కూడా 14 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 
 
ఈ నేపథ్యంలో నితీష్ కుమార్‌కు గత నాలుగు రోజులుగా జ్వరం లక్షణాలు కనిపించడంతో ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా వైరస్ సోకినట్టు వైద్యులు నిర్థారించారు. 
 
గత రెండుమూడు రోజులుగా సీఎం నితీశ్ అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయను క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు ప్రత్యేక వైద్య బృందం చికిత్స చేస్తూ పర్యవేక్షిస్తుంది. 

అన్నీ చూడండి

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments