Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా మరో 10 వేల కరోనా కేసులు

Written By ఠాగూర్
Updated: ఆదివారం, 7 నవంబరు 2021 (10:42 IST)
దేశంలో కొత్త‌గా మరో 10,853 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. అలాగే, 12,432  మంది క‌రోనా నుంచి కోలుకున్నార‌ని తెలిపింది. ప్ర‌స్తుతం దేశంలో 1,44,845 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటున్నారు.
 
మరోవైపు, క‌రోనాతో గత 24 గంటల్లో 526 మంది ప్రాణాలు కోల్పోయారు. క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,37,49,900 మంది కోలుకున్నారు. క‌రోనా వ‌ల్ల దేశంలో మొత్తం 4,60,791 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇదిలావుంటే, దేశ వ్యాప్తంగా 28,40,174  డోసుల క‌రోనా వ్యాక్సిన్ వినియోగించారు. మొత్తం 1,08,21,66,365 డోసుల వ్యాక్సిన్లు వాడారు. తమిళనాడు రాష్ట్రంలో ఇంటింటికి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. వైద్య సిబ్బందే ప్రతి ఒక్కరి ఇంటికి కరోనా వ్యాక్సిన్లు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 

అన్నీ చూడండి

ఉన్నట్టుండి ఫ్రేమ్‌లోకి వచ్చిన త్రిష - ముఖం తిప్పేసుకున్న సీఎం విజయ్ (వీడియో)

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

Ram-Lakshman: మా అబ్బాయికి జడలు వేయించి యాక్షన్ చేయించాం : రామ్-లక్ష్మణ్

తర్వాతి కథనం
Show comments