ప్రకాశం జిల్లాలో పెరుగుతున్న కరోనా

శనివారం, 6 జూన్ 2020 (11:52 IST)
ప్రకాశం  జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా మరో రెండు కరోనా కేసులు నమోదు కావడంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 113కు చేరింది.

నిన్న కందుకూరు, పొదిలికి చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా నిర్ధారణ కోసం  41,770  శ్యాంపిళ్లు పంపగా అందులో 39,112 నెగిటివ్ ఫలితాలు వచ్చాయి.

ఇంకా 2545 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా క్వారంటైన్లలో  682 మంది ఉన్నారు. ఇప్పటి వరకు కరోనా బారి నుండి కోలుకుని 66 మంది డిశ్చార్జ్ అవగా...జిల్లాలో ప్రస్తుతం 47 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

అన్నీ చూడండి

Shalini: సింగ్ గీతం లో విలన్ క్యారెక్టర్ చేశాను. మాటే పాటగా మారే కథ ఇది : శాలిని కొండెపుడి

Sunitha: భానుచందర్, సునీత, సి కళ్యాణ్ ఆవిష్కరించిన కొత్త మలుపు ట్రైలర్

SV Krishna Reddy: ఎస్వీ కృష్ణారెడ్డి మ్యూజిక్ కు వరల్డ్ రికార్డ్ గుర్తింపు దక్కింది

Janhvi Kapoor : సినిమా అనేది ప్రజలకు చేసే సేవ : జాన్వీ కపూర్

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ చిత్రం ఇరుముడి గ్లింప్స్ రాబోతోంది

తర్వాతి కథనం
Show comments