తిరుపతిలో వెయ్యి మంది కరోనా పేషంట్లు మాయం?

బుధవారం, 28 ఏప్రియల్ 2021 (17:48 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా ప్రబలుతున్న పట్టణాల్లో తిరుపతి ఒకటి. కానీ, ఈ పట్టణంలో కరోనా వైరస్ బారినపడే రోగులకు తిరుపతి వైద్యాధికారులు ముచ్చెమటలు పోయిస్తున్నారు. 
 
గత రెండు నెలల కాలంలో తిరుపతిలో 9,164 మంది కరోనా బారిన పడగా... ప్రస్తుతం 7,270 మంది ఆచూకీ మాత్రమే లభించింది. మిగిలిన 1,049 మంది రోగులు ఎక్కడున్నారనే విషయం తెలియడం లేదు. 
 
వారు ఇచ్చిన ఇంటి నెంబర్లలో కూడా వారు లేరు. వారి ఫోన్ నంబర్లు కూడా పని చేయడం లేదు. దీంతో వారి కోసం అధికారులు వేట ప్రారంభించారు. మరో 845 మంది పాజిటివ్ రోగులు తిరుపతిని వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని అధికారులు గుర్తించారు.
 
కరోనా శాంపిల్స్ ఇచ్చే సమయంలో బాధితులు తప్పుడు చిరునామాలు, ఫోన్ నంబర్లు ఇస్తున్నారు. ఆ తర్వాత టెస్టు రిపోర్టులు రాకముందే వారు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నట్టు అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరహా వ్యక్తులు ఇతరులకు కూడా కరోనాను అంటిస్తున్నారని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. 

అన్నీ చూడండి

Peddi Tour: రామ్ చరణ్ పెద్ది పవర్‌ప్లే టూర్ ప్రారంభించింది

నిర్మాత, ఎగ్జిబిటర్ల మధ్య దూషణలు, థియేటర్ ఆదాయంపై వివాదం చెలరేగింది

జగపతి బాబు, ఆకెళ్ల వి కృష్ణ కాంబినేషన్ చిత్రం వదలా టైటిల్ సాంగ్ రిలీజ్

Sanjaydath: ది డెవిల్ ఆగ‌మ‌నం - కెడి: ది డెవిల్ ట్రైల‌ర్‌తో మాస్ హంగామా

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా

తర్వాతి కథనం
Show comments