దేశంలో తగ్గుతున్న కరోనా తీవ్రత, రికవరీ రేటు 90 శాతం కంటే ఎక్కవే

శనివారం, 17 అక్టోబరు 2020 (16:32 IST)
కరోనా మహమ్మారి తీవ్రత ప్రస్తుతం దేశంలో తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా గణాంకాలు దేశానికి ఉపశమనం కలిగిస్తున్నాయి. శుక్రవారం 62 వేల 104 కొత్త కేసులు నమోదు కాగా 70 వేల 386 మంది రోగులు కోలుకున్నారు. ఇదిలా ఉండగా 839 మంది కరోనాతో  పోరాడి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 8 లక్షలు కన్నా ఎక్కువగా వచ్చాయి.
 
దేశంలో మొత్తం 7 లక్షల 94 వేల మంది రోగులు చికిత్స పొందుతున్నారు. దేశవ్యా ప్తంగా మొత్తం 74.34 లక్షల కేసులు నమోదు కాగా 9 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలలో 90శాతం కంటే ఎక్కువ మంది రోగులు కోలుకున్నారు. ఇది జాతీయ సగటు 87.8 శాతాని కంటే ఎక్కువ అని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
 
మిగిలిన రాష్ట్రాలలో కూడా ఈ సంఖ్య 80 శాతం లేదా అంతకంటే ఎక్కువ కూడా రికవరీ రేటు ఉంటుందని తెలిపింది. మరోవైపు రాబోయే రెండున్నర నెలలు చాలా కీలకమని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ శుక్రవారం అన్నారు. పండుగ సీజన్‌తో పాటు, చలికాలం రాబోతుండటంతో కరోనా సంక్రమణ అధికమవుతుందని తెలిపారు.
 

అన్నీ చూడండి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments