ఆంధ్రప్రదేశ్‌లో కరోనా దూకుడు : మరో 54 పాజిటివ్ కేసులు

శుక్రవారం, 8 మే 2020 (12:39 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల్లో కొత్తగా మరో 54 కేసులు నమోదయ్యాయి. మొత్తం 7,320 శాంపిళ్లను పరిశీలించగా, అందులో 54 మందికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయినట్టు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 
 
రాష్ట్రంలో గత 24 గంటల్లో అనంతపురంలో 16, చిత్తూరులో 3, గుంటూరులో 1, కృష్ణాలో 6, కర్నూలులో 7, విశాఖపట్నంలో 11, విజయ నగరంలో 1 కేసు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరిలో 9 కేసులు నమోదయ్యాయి.
 
ఇకపోతే, రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,887గా ఉందని తెలిపింది. వారిలో ఇప్పటివరకు 842 మంది డిశ్చార్జ్ కాగా, 41 మంది మరణించారని వివరించింది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,004గా ఉందని పేర్కొంది. 
 
మరోవైపు, రాష్ట్రంలోని జిల్లాల్లో నమోదైన కరోనా కేసుల సంఖ్యను పరిశీలిస్తే, అనంతపురంలో 99, చిత్తూరులో 85, ఈస్ట్ గోదావరిలో 20, గుంటూరులో 374, కడపలో 96, కృష్ణలో 322, కర్నూలులో 547, నెల్లూరులో 96, ప్రకాశంలో 61, శ్రీకాకుళంలో 5, విశాఖపట్టణంలో 57, విజయనగరంలో 4, వెస్ట్ గోదావరిలో 68, గుజరాత్, కర్నాటక రాష్ట్రాలకు చెందిన 27 మంది వలస కూలీల కేసులు ఉన్నాయి. 

అన్నీ చూడండి

Purushah Review: భార్యాభర్తల కష్టాలను వినోదాత్మకంగా చెప్పిన పురుషః చిత్రం రివ్యూ-

Rukmini Vasanth: రుక్మిణి వసంత క్యాజువల్ ప్యాకింగ్ క్లిప్ అభిమానుల ప్రశంసలు

Charan: డ్రైవింగ్ త్రూ పెద్ది మెమరీస్ పంచుకున్న రామ్ చరణ్, బుచ్చిబాబు

Virat Karna: నాగబంధం పోస్ట్-ప్రొడక్షన్ - విఎఫ్ఎక్స్ పనుల్లో బిజీ

Vadde Naveen: వడ్డే నవీన్ నటిస్తూ నిర్మించిన చిత్రం ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు

తర్వాతి కథనం
Show comments