దేశంలో విజృంభిస్తోన్న కరోనా.. 511 మంది మృతి.. 91 లక్షల మార్క్ చేరిన కేసులు

సోమవారం, 23 నవంబరు 2020 (10:54 IST)
దేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 44,059 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 91,40,312కి చేరింది. ఇక గత 24 గంటల్లో 41,024 మంది కోలుకున్నారు. 
 
గడిచిన 24 గంటల సమయంలో 511 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,33,738 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 85,62,642 మంది కోలుకున్నారు.  ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,43,486 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కరోనా బులెటిన్‌లో పేర్కొంది కేంద్ర ప్రభుత్వం. కాగా, 40 వేలకు దిగవగా పడిపోయిన రోజువారీ కేసుల సంఖ్య... చలి తీవ్రత పెరుగుతుండడంతో.. మళ్లీ విజృంభిస్తూ వస్తోంది.  

అన్నీ చూడండి

రుక్మిణీ వసంత్ అదుర్స్.. ఇదే అసలు గోట్ పర్మార్మెన్.. వీడియో వైరల్ (Video)

Peddi OTT: రామ్ చరణ్ బ్లాక్‌బస్టర్‌ పెద్ది ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడ చూడాలి !

Thiruveer : ప్రాణాయామం చేస్తూ మెలోడీ సాంగ్ తో తిరువీర్, ఐశ్వర్య రాజేష్

Samantha: సోనీ లివ్ లో క్రేజీ ప్రాజెక్ట్‌తో కొత్త హిస్టరీని క్రియేట్ చేయబోతోన్న సమంత

డా. శివరాజ్‌కుమార్‌, డాలీ ధనంజయ చిత్రం 666 ఆపరేషన్‌ డ్రీమ్‌ థియేటర్‌ టీజర్‌

తర్వాతి కథనం
Show comments