మరోమారు లాక్‌డౌన్ తప్పదా : మంతనాలు జరుపుతున్న మోడీ?

Written By సెల్వి
Updated: శనివారం, 9 మే 2020 (10:13 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి ఏమాత్రం అడ్డుకట్టపడటం లేదు. ముఖ్యంగా, లాక్డౌన్ ఆంక్షలను సడలించిన తర్వాత పరిస్థితి మరింత ఎక్కువైంది. ప్రతి రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇది ఆందోళన కలిగిస్తోంది. అదేసమయంలో మృతుల సంఖ్య కూడా పెరిగింది. 
 
ముఖ్యంగా, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ కేసులు కేంద్రంతో పాటు.. స్థానిక ప్రభుత్వాలను హడలెత్తిస్తోంది. దీనికితోడు మద్యంకోసం మందుబాబులు సామాజిక భౌతిక దూరం మరచి ఎగబడుతున్నారు. దీంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. 
 
ఈ పరిస్థితిల్లో లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడగించాలన్న ఉద్దేశ్యంతో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ సహచరులు, నిపుణులు, ఉన్నతాధికారులతో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. 
 
కాగా, ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్ 56342కు చేరగా, గత 24 గంటల్లో 3392 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే, గత 24 గంటల్లో 13 మంది చనిపోగా, మొత్తం చనిపోయిన మృతుల సంఖ్య 1880కు చేరాయి. ఒక్క శుక్రవారమే మహారాష్ట్రలో 1261 కేసులు నమోదయ్యాయి. ఇదే పరిస్థితి తమిళనాడులోనూ నెలకొంది. 

అన్నీ చూడండి

Jayasudha : సమ్మర్ హాలిడేస్.. లో అమ్మమ్మ సుశీలమ్మగా జయసుధ

Rahul Sipligunj : బైక్ రైడర్ సీటులో దారిచూపిన వ్యక్తి అంటూ ఆనందక్షణాలతో రాహుల్ సిప్లిగంజ్‌

Prashanth Neel : డ్రాగన్ కు ముందు భయపెట్టే చిత్రంగా ప్రశాంత్ నీల్ 418 చిత్రం సిద్ధమైంది

Allari Naresh :సురభి తో నా కంటి మీద కునుకే లేదంటున్న అల్లరి నరేష్

Madhav's look : యుద్ధంలో పోరాడినట్లుగా మారెమ్మ నుంచి మాధవ్ లుక్

తర్వాతి కథనం
Show comments