Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాలో కరోనా మరణాలు 51 - పాజిటివ్ కేసులు 6235

Written By ఠాగూర్
Updated: సోమవారం, 21 సెప్టెంబరు 2020 (18:23 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. అటు పాజిటివ్ కేసులతో పాటు.. ఈ వైరస్ సోకి మరణించే వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. తాజాగా గడచిన 24 గంటల్లో మొత్తం 51 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోగా, మరో 6235 మంది ఈ వైరస్ బారినపడ్డారు. 
 
ఇందులో ఒక్క తూర్పు గోదావరి జిల్లాలో మాత్రమే వెయ్యికి పైగా కేసులు వచ్చాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,31,749కి పెరిగింది. మరణాల సంఖ్య 5,410కి చేరింది. తాజాగా 10,502 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఓవరాల్‌గా ఇప్పటివరకు 5,51,821 మంది ఈ వైరస్ మహమ్మారి నుంచి విముక్తులయ్యారు. ఇంకా 74,518 మంది చికిత్స పొందుతున్నారు.
 
ఇకపోతే, జిల్లాల వారీగా యాక్టివ్ కేసుల సంఖ్యను పరిశీలిస్తే, అనంతపురం 2,996, చిత్తూరు 6,906, ఈస్ట్ గోదావరి 12,134, గుంటూరు 6,418, కడప 3,569, కృష్ణ 2,849, కర్నూలు 2,868, నెల్లూరు 2,757, ప్రకాశం 10,935. శ్రీకాకుళం 5,205, విశాఖపట్టణం 4,206, విజయనగరం 6,876, వెస్ట్ గోదావరి 6,899 చొప్పున మొత్తం 7,4518 కేసులు ఉన్నాయి. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments