Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాకు కొత్త లక్షణాలు వచ్చాయ్.. వాంతులొస్తే జాగ్రత్త..!

Written By సెల్వి
Updated: శుక్రవారం, 3 జులై 2020 (12:28 IST)
కరోనాకు కొత్త లక్షణాలు వచ్చాయ్.. అందుకే చాలా జాగ్రత్తగా వుండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా లక్షణాలు రోజు రోజుకు మారుతూనే వున్నాయి. సాధారణంగా దగ్గు, జ్వరం, జలుబు వంటి లక్షణాలుంటే వాటిని కరోనాగా గుర్తించేవారు. ఆ తరువాత అందులో అనేక కొత్త లక్షణాలు వచ్చి చేరాయి. 
 
కరోనా సోకిన రోగుల్లో ఇప్పుడు మరికొన్ని కొత్త లక్షణాలను గుర్తించారు. అవే వికారం, వాంతులు, ఒళ్ళు నొప్పులు. కరోనా సోకిన రోగులకు వికారంగా ఉండటం ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో పాటు చాలామందికి వాంతులు అవుతున్నాయి. మోకాళ్ళ నుంచి కింది భాగంలో నొప్పులు ఉండటాన్ని అధికారులు గుర్తించారు. 
 
ఇక మరికొంత మందిలో ఈ వాంతులతో పాటుగా డయేరియా లక్షణాలు కూడా కనిపిస్తున్నాయని, జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కొంతమందిలో షుగర్ లెవల్స్ తక్కువగా ఉండటం కూడా కరోనా లక్షణంగా గుర్తించినట్టు కరోనా టాస్క్ ఫోర్స్ సభ్యులు చెప్తున్నారు. ఇలాంటి వారికి ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుందని అన్నారు. 
 
దురద, దద్దుర్లు వంటివి కనిపిస్తున్నాయని.. కరోనా వైరస్ రూపాంతరం చెందుతుండటం వలన లక్షణాలు కూడా మారుతున్నాయని వైద్యులు చెప్తున్నారు. 

అన్నీ చూడండి

Rocking Star Yash: రాకింగ్ స్టార్ యష్.. టాక్సిక్' ట్రైలర్ ఆగస్టు 8న రిలీజ్

Manasa Chowdary : లవ్ జాతర నుంచి మానస చౌదరి బర్త్ డే పోస్టర్

రవీనా టాండన్ ను ఆదర్శంగా తీసుకోవాలంటున్న వెంకీ అట్లూరి

చైనా పీస్ కు యా/ఏ సర్టిఫికెట్‌, సెప్టెంబర్‌లో రిలీజ్

Varun Tej : ఒకే బాడీలో రెండు ఆత్మలు ఉండే ఛాలెంజింగ్ ఫాత్ర పోషించా : వరుణ్ తేజ్

తర్వాతి కథనం
Show comments