కరోనా సెకండ్ వేవ్.. చలికాలం వచ్చేస్తోంది.. జాగ్రత్త..!

శుక్రవారం, 30 అక్టోబరు 2020 (13:30 IST)
దేశంలో కరోనా కేసులు 80 లక్షలు దాటేశాయి. సగం మందికి అనధికారికంగా వచ్చిపోయిందని కొందరంటున్నారు. ఏది ఏమైనా డిసెంబర్‌ నాటికి కరోనా తగ్గుముఖం పడుతుందని సర్కారీ గణాంకాలు చెబుతున్నాయి. మరణాల రేటు కూడా తగ్గుతోంది. అయినా ప్రజల నిర్లక్ష్యం కారణంగా వ్యవహరిస్తున్నారు.  నవంబర్‌ 30 వరకు నిబంధనలున్నా జనం సామాన్యజీవనానికి వచ్చేస్తున్నారు. ఉద్యోగాలు, ఉపాధి ఇతర అవసరాల కోసం పరిమితులు దాటిపోతున్నారు. 
 
ఈ నేపథ్యంలో చలికాలం వచ్చేసింది. వైరస్, బ్యాక్టీరియాలు పంజా విసరడానికి.. ఇది ఎంతో అనుకూలమైన కాలం. ఈ ఏడాది కరోనాతో పాటు మరెన్నో సీజనల్ రోగాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏటా ఈ సమయంలో డెంగీ, మలేరియా, స్వైన్ ఫ్లూ తదితరల సీజనల్ వ్యాధులు విపరీతంగా అటాక్ చేస్తాయి. గతంతో పోలీస్తే ఈసారి సీజనల్ వ్యాధులు కాస్త తక్కువగానే నమోదవుతున్నా.. ఈ సమయంలో కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్యులు. 
 
ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లు అనిపిస్తుంది.. అలా అని కరోనా పీడ విరగడైందనే భ్రమ మాత్రం వద్దంటున్నారు డాక్టర్లు. ఇప్పటికే అమెరికా, ఐరోపా దేశాల్లో సెకండ్ వేవ్ వణికిస్తోంది. కేరళలో తగ్గిన కరోనా కేసులు.. ఓనం పండుగ తర్వాత పెరిగిపోయాయి. అందుకే మొదటి సారి వైరస్ నియంత్రణ కోసం తీసుకున్న జాగ్రత్తలు.. ఇపుడు కచ్చితంగా కొనసాగించాలంటున్నారు వైద్యులు.

అన్నీ చూడండి

Kiran Abbavaram: దర్శకుడిగా తొలి చిత్రం రియాలిటీ ని ప్రారంభించిన కిరణ్ అబ్బవరం

Vishal: విశాల్ దర్శకత్వంలో మకుటం యాక్షన్ టీజర్‌ విడుదల

Television producers: టాప్కోస్ ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

Samantha మా ఇంటి బంగారం చూస్తే మీ డబ్బు, సమయానికి నేను హామీ : సమంత

Sing Geetham Review: ఆసక్తిగా మలిచిన సింగీతం శ్రీనివాస్ చిత్రం... సింగ్ గీతం రివ్యూ

తర్వాతి కథనం
Show comments