ఏపీలో కొత్తగా 5674 కరోనా పాజిటివ్ కేసులు

శనివారం, 19 జూన్ 2021 (18:46 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 5674 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1,068 కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 166 మంది కరోనా బారిన పడ్డారు. ఇదే సమయంలో 45 మంది మహమ్మారి వల్ల మృతి చెందారు. 8,014 మంది డిశ్చార్జ్ అయ్యారు.
 
తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 18,44,917కి చేరగా... 17,67,404 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 12,269 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 65,244 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
మరోవైపు, దేశంలో గత 24 గంటల్లో 60,753 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అలాగే, 97,743 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,98,23,546కు చేరింది. మరో 1,647 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,85,137కు పెరిగింది.
 
ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,86,78,390 మంది కోలుకున్నారు. 7,60,019 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇక వ్యాక్సినేషన్ కు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 27,23,88,783 డోసులు ఇవ్వడం జరిగింది.   

అన్నీ చూడండి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments