తెలంగాణాలో పెరుగుతున్న ఒమిక్రాన్... పాజిటివ్ కేసులు 21

మంగళవారం, 21 డిశెంబరు 2021 (12:09 IST)
తెలంగాణా రాష్ట్రంలో ఒమిక్రాన్ వైరస్ క్రమక్రమంగా పాగా వేస్తోంది. ఒక్కో కేసుతో మొదలైన ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 21కు చేరుకుంది. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఒమిక్రాన్ కేసు నమోదైంది. 
 
ఇటీవల దుబాయ్ నుంచి ఈ గూడెంకు వచ్చిన ఓ వ్యక్తికి పాజిటివ్ అనితేలింది. దీంతో బాధితుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే, ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా కొత్త వేరియంట్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీరి ఫలితాలు రావాల్సివుంది. 
 
మరోవైపు, జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు వెలుగు చూడటంతో జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల విదేశాల నుంచి పది మందికి, ఒమిక్రాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఇద్దరికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిన విషయం తెల్సిందే. 

అన్నీ చూడండి

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్న బ్రహ్మయుగం

New Delhi: 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల ప్రకటన వెలువడింది

L.B. Sriram: ఆలస్యంగా గుర్తించినందుకు అవమానంగా ఉంది : ఎల్. బి. శ్రీరామ్

Ali: బద్రి లోని హే చికీతా పాట పెద్ద హిట్ అయిందో ఈ సినిమా హిట్ : అలీ

Soori: సుహాస్, సూరి నటించిన మండాడి చిత్రాన్ని విడుదలచేస్తున్న మైత్రి డిస్ట్రిబ్యూటర్స్

తర్వాతి కథనం
Show comments