Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొన్నూరు ఎమ్మెల్యేకు కరోనా.. కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫెరెన్స్‌కు వెళ్లి..?

Written By సెల్వి
Updated: శనివారం, 4 జులై 2020 (12:07 IST)
Ponnur MLA
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వణికిస్తోంది. సామాన్య ప్రజల నుంచి నాయకులు, ప్రజా ప్రతినిధులు వరకు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా అధికారపార్టీ వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్యేకి కరోనా సోకింది. ఈ విషయాన్ని గుంటురు జిల్లా పొన్నూరు నియోజకవర్గానికి చెందిన కిలారి రోశయ్య సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించారు. 
 
గురువారం కరోనా టెస్టులు చేయించుకున్నానని.. కలెక్టరేట్‌లో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌కు వెళ్లినప్పుడు ఈ విషయం తెలిసిందన్నారు. తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, ఆరోగ్యంగా ఉన్నానని రోశయ్య తెలిపారు. హోం క్వారంటైన్‌లో ఉన్నానని, త్వరలోనే కోలుకుంటానంటూ పేర్కొన్నారు.  
 
ఇదిలాఉంటే.. ఎమ్మెల్యే రోశయ్యకు కరోనా పాజిటీవ్ అని తెలియడంతో కలెక్టరేట్‌లో మీటింగ్‌కు హాజరై ఆయనతో సన్నిహితంగా మెలిగిన అధికారులు, మిగతా ప్రజా ప్రతినిధులు భయాందోళనకు గురవుతున్నారు.

అన్నీ చూడండి

ప్రభాస్ చిత్రం పౌర్ణమిలోని తెలుగు పాటకు చైనీస్ నర్తకి నాట్యం ట్రెండింగ్ వీడియో

మమ్ముట్టి మూవీ ‘ఓం: చాప్ట‌ర్‌1-ఉధిరం’ నుంచి వీడియో గ్లింప్స్

Fauzi Update: పోస్ట్‌ప్రొడక్షన్‌తో ఫౌజీ స్పీడ్.. షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన ప్రభాస్ ?

Sumanth: పవన్ కళ్యాణ్ గారికి వారాహి పాజిటివ్‌గా హెల్ప్ అయింది : సుమంత్

Anaswara Rajan look: కాకా చిత్రానికి అనస్వర రాజన్ హృదయం అని కితాబు

తర్వాతి కథనం
Show comments