Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిషికేష్‌లో హోటల్ తాజ్ మూసివేత.. ఎందుకో తెలుసా?

Written By ఠాగూర్
Updated: మంగళవారం, 30 మార్చి 2021 (08:15 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రిషికేష్‌లో హోటల్ తాజ్‌ను మూసివేశారు. ఈ హోటల్‌లో పని చేసే సిబ్బందిలో 76 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఈ వైరస్ వ్యాప్తి చెందకుండు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా హోటల్‌ను తాత్కాలికంగా మూసివేసి, శానిటైజ్ చేస్తున్నారు. 
 
కాగా, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో రిషికేష్‌ నగరంలోని హోటల్ తాజ్ ఐదు నక్షత్రాల హోటల్‌లో 76 మందికి కరోనా సోకింది. దీంతో తెహ్రీ గర్హ్వాల్ అధికారులు హోటల్ తాజ్‌ను మూడు రోజుల పాటు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. 
 
కరోనా కేసులు వెలుగుచూసిన హోటల్ తాజ్‌ను శానిటైజ్ చేయించి ముందుజాగ్రత్తగా తాత్కాలికంగా మూసివేశామని తెహ్రీ గర్హ్వాల్ ఎస్పీ తృప్తి భట్ చెప్పారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 1660 కరోనా కేసులు నమోదైనాయి. రాష్ట్రంలో మొత్తం 96,512 కరోనా కేసులు నమోదు కాగా, 1709 మంది మరణించారు.

అన్నీ చూడండి

జగన్‌తో కలిసి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో కలిసి చదువుకున్నాం : మంచు విష్ణు

ది మేజ్ నుంచి నన్నే నన్నే.. అనే మెలోడీ సాంగ్ ను ఆవిష్కరించిన ఆనంద్ దేవరకొండ

Srinivasa Mangapuramm Review: ఆకట్టుకోని జై కృష్ణ నటించిన శ్రీనివాస మంగాపురం రివ్యూ

Ramayan trialer: తమ్ముడూ యశ్ నువ్వు అదరగొట్టావు అంటూ ప్రశాంత్ నీల్ ట్వీట్

కాంతార రిషబ్ శెట్టికి అరుదైన అవార్డు.. ఆస్ట్రేలియాలో లీడర్‌షిప్ ఇన్ సినిమా అవార్డు

తర్వాతి కథనం
Show comments