తెలంగాణలో కరోనా వైరస్‌.. 3837 కొత్త కేసులు

బుధవారం, 19 మే 2021 (19:32 IST)
తెలంగాణలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 71,070శాంపిల్స్‌ పరీక్షించగా.. 3837 కేసులు నమోదయ్యాయి. అలాగే, కొత్తగా 25మంది మృతిచెందగా.. 4976 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
 
జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 594 కొత్త కేసులు రాగా.. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 265, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో 239, ఖమ్మం జిల్లాలో 227 చొప్పున నమోదయ్యాయి.
 
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1,42,67,002 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 5,40,603మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 4,90,620మంది కోలుకోగా.. 3,037మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ప్రస్తుతం 46,946 క్రియాశీల కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 90.75శాతం కాగా.. మరణాల రేటు 0.56శాతంగా ఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.

అన్నీ చూడండి

కళ్యాణ్ రామ్ బర్త్‌ : సర్‌ప్రైజ్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి

రుక్మిణీ వసంత్ అదుర్స్.. ఇదే అసలు గోట్ పర్మార్మెన్.. వీడియో వైరల్ (Video)

Peddi OTT: రామ్ చరణ్ బ్లాక్‌బస్టర్‌ పెద్ది ఓటీటీ స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడ చూడాలి !

Thiruveer : ప్రాణాయామం చేస్తూ మెలోడీ సాంగ్ తో తిరువీర్, ఐశ్వర్య రాజేష్

Samantha: సోనీ లివ్ లో క్రేజీ ప్రాజెక్ట్‌తో కొత్త హిస్టరీని క్రియేట్ చేయబోతోన్న సమంత

తర్వాతి కథనం
Show comments