కోవిడ్ కేసులు.. భారత్‌లో తగ్గుదల - ప్రపంచంలో పెరుగుదల

మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (11:29 IST)
కరోనా వైరస్ వ్యాప్తి దేశ వ్యాప్తంగా క్రమేపీ తగ్గిపోతోంది. అదేసమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. మన దేశంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా కొత్త కరోనా కేసుల నమోదులో గణనీయమైన తగ్గుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,369 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 
అలాగే, మరో 5,178 మంది ఈ వైరస్ నుంచి విముక్తులయ్యారు. దీంతో దేశ వ్యాప్తంగా ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 46,347గా ఉంది. మరోవైపు, ఇతర ప్రపంచ దేశాల్లో మాత్రం రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 
 
ఇదిలావుంటే, మన దేశంలో ఈ వైరస్ నుంచి 5,28,185 మంది చనిపోయారు. ఇప్పటివరకు 4,39,30,417 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో క్రియాశీలక రేటు 0.10 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.71 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. 

అన్నీ చూడండి

బిగ్ బాస్ 10 సీజన్‌లో అడుగుపెట్టాలని వుంది, నన్ను సెలక్ట్ చేయండి: నంద్యాల ఎస్ఐ సెల్ఫీ వీడియో

OG2 : తుఫాను రాకముందు.. ఒక నిశ్శబ్ద క్షణం అంటూ.. ఓజీ 2 అప్ డేట్

Samantha career over : స‌మంత కెరీర్‌ అయిపోయింద‌న్నారు, క‌రెక్టేనేమో అనిపించింది : స‌మంత‌

వందేమాతరం శ్రీనివాస్ కుమారుడు సుస్వర తరంగ్ హీరోగా చిత్రం

పెద్దలను ఎదిరించి ప్రియుడిని పెళ్లాడిని జబర్దస్త్ ఫైమా

తర్వాతి కథనం
Show comments