మళ్లీ 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు

గురువారం, 7 అక్టోబరు 2021 (10:07 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ 20 వేలకు పైగా నమోదవుతున్నాయి. ఇటీవల 16 వేలుగా నమోదవుతూ వచ్చిన ఈ కేసులు ఒక్కసారిగా 20 వేలకు పైగా చేరాయి. గడిచిన 24 గంటల్లో కొత్త‌గా 22,431 క‌రోనా కేసులు నమోదుకాగా, క‌రోనా నుంచి 24,602 మంది కోలుకున్నారు. క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,38,94,312కి పెరిగింది. 
 
దీంతో కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,32,00,258కి చేరింది. నిన్న 318 మంది క‌రోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య  4,49,856కు చేరింది. ప్ర‌స్తుతం 2,44,198 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఒక్క కేరళ రాష్ట్రంలోని 12616 పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. 
 
నిన్న దేశంలో 43,09,525 వ్యాక్సిన్ డోసులు వేశారు. దీంతో మొత్తం వినియోగించిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 92,63,68,608కి పెరిగింది. కేర‌ళ‌లో నిన్న 12,616 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 134 మంది క‌రోతో ప్రాణాలు కోల్పోయారు. 

అన్నీ చూడండి

Chiru, Bobby: వర్షంలో 12 గంటలు తడుస్తూ షూటింగ్‌ చేసిన మెగాస్టార్ చిరంజీవి

దాదా- ది సౌర‌వ్ గంగూలీ స్టోరీ మూవీ ఫ‌స్ట్ లుక్, 2027న సినిమా విడుద‌ల‌

Rashmika: మైసా కోసం రష్మిక రిస్కీ స్టంట్స్.. అండర్‌వాటర్ ఫైట్ సీక్వెన్స్ పూర్తి

Sagar: వంద మందిని పరిచయం చేస్తూ కొత్త సినిమా..మేము కూడా సినిమా తీసినామురో

Naresh Vijaya Krishna: తమిళనాడు ఆదర్శంగా ఆంధ్ర లో కొత్త రాజకీయ శక్తి : నరేష్ విజయ కృష్ణ

తర్వాతి కథనం
Show comments