ఒక్క కేరళలో 19 వేలు - దేశంలో 30 వేల పాజిటివ్ కేసులు

మంగళవారం, 31 ఆగస్టు 2021 (10:39 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నాయి. కానీ, కేరళ రాష్ట్రంలో మాత్రం రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశంపై చెప్పుకోవచ్చు. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 30941 కరోనా పాజిటివ్ కేసులు నమోదైతే అందులో 19622 పాజిటివ్ కేసులు ఒక్క కేరళ రాష్ట్రంలోనే నమోదు కావడం గమనార్హం. 
 
దేశ వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 30,941 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 350 మంది మ‌ర‌ణించారు. ఈ మ‌హ‌మ్మారి నుంచి మ‌రో 36,275 మంది కోలుకున్నారు. 
 
ప్ర‌స్తుతం 3,70,640 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్ప‌టివర‌కు 4,38,560 మంది క‌రోనాకు బ‌ల‌య్యారు. కేర‌ళ‌లో కొత్త‌గా 19,622 కేసులు న‌మోదు కాగా, 132 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో 64.05 కోట్ల‌కు పైగా టీకా డోసుల పంపిణీ జ‌రిగింది.

అన్నీ చూడండి

Rashi: ది రెడ్ బ్యాగ్ చిత్రంలో సావిత్రి అనే పవర్ ఫుల్ పాత్రలో రాశీ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ సినిమాకు సుధీర్ జోకర్ అనే టైటిల్ ఖరారు

Peddi trailer: మూడు విభిన్న క్రీడలతో హీరోగా ఎదిగిన కథతో పెద్ది ట్రైలర్

Seiyaan: శివకార్తికేయన్, కమల్ హాసన్ చిత్రం సెయాన్ నేడు ప్రారంభం

సినిమా బండి త‌ర్వాత నటుడిగా కెరీర్ పూర్తిగా మారింది: రాగ్ మ‌యూర్‌

తర్వాతి కథనం
Show comments