ఒక్క కేరళలో 19 వేలు - దేశంలో 30 వేల పాజిటివ్ కేసులు

మంగళవారం, 31 ఆగస్టు 2021 (10:39 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నాయి. కానీ, కేరళ రాష్ట్రంలో మాత్రం రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇది ఆందోళన కలిగించే అంశంపై చెప్పుకోవచ్చు. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 30941 కరోనా పాజిటివ్ కేసులు నమోదైతే అందులో 19622 పాజిటివ్ కేసులు ఒక్క కేరళ రాష్ట్రంలోనే నమోదు కావడం గమనార్హం. 
 
దేశ వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 30,941 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 350 మంది మ‌ర‌ణించారు. ఈ మ‌హ‌మ్మారి నుంచి మ‌రో 36,275 మంది కోలుకున్నారు. 
 
ప్ర‌స్తుతం 3,70,640 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్ప‌టివర‌కు 4,38,560 మంది క‌రోనాకు బ‌ల‌య్యారు. కేర‌ళ‌లో కొత్త‌గా 19,622 కేసులు న‌మోదు కాగా, 132 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో 64.05 కోట్ల‌కు పైగా టీకా డోసుల పంపిణీ జ‌రిగింది.

అన్నీ చూడండి

జియోస్టార్, భారతదేశ వ్యాప్తంగా ఆరు బిగ్ బాస్ ఎడిషన్లు ఒకేచోట

Prabhas: స్పిరిట్ పంపిణీ కోసం పీపుల్ మీడియా, ఏషియన్ సురేష్ భాగస్వామ్యం

Priyadarshi: ఈ కథ విన్నప్పుడు మా అమ్మ గుర్తొచ్చింది : ప్రియదర్శి

Vijay: ఒకేలా బతకడానికి ఇంత పెద్ద జన్మ ఎందుకు? అనేది నాకు స్పూర్తి : వెంకట్ కె. నారాయణ

సోనమ్ రఘువంశీ ప్రవర్తనపై ప్రశ్నాస్త్రాలను సంధించిన సుప్రీం కోర్టు

తర్వాతి కథనం
Show comments