మంగళవారం, 2 జులై 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 ఆగస్టు 2021 (18:59 IST)

డిస్కస్ త్రోలో భారత్‌కు కాంస్య పతకం

టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ 2020లో క్రీడల్లో భారత అథ్లెట్లు దుమ్మురేపుతున్నారు. ఈ పోటీల్లో భాగంగా ఆదివారం భారత్ ఖాతాలో మూడు పతకాలు వచ్చి చేరాయి. ఇందులో ఒకటి టేబుల్ టెన్నిస్ విభాగంలో కాగా, రెండోది హైజంప్‌లో, మూడోది డిస్కస్ త్రో విభాగంలో వచ్చింది. 
 
టేబుల్ టెన్నిస్‌ విభాగంలో రజతం, హైజంప్‌లో రజత పతకం వచ్చాయి. ఆదివారం ముచ్చటగా మూడో పతకంగా డిస్కస్ త్రో విభాగంలో వినోద్ కుమార్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో ఓకే రోజు భారత్ ఖాతాలో మూడు పతకాలు చేరాయి.