దేశంలో పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

గురువారం, 12 మే 2022 (11:34 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసులపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. గత 24 గంటల్లో 4.71 లక్షల మంతికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా, 2827 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తేలింది. 
 
అదేసమయంలో కరోనా నుంచి 3230 మంది కోలుకున్నారు. మరో 24 మంది చనిపోయారు. కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా  ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో 19067 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
ఇదిలావుంటే, తాజా కేసులతో కలుపుకుంటే దేశంలో ఇప్పటివరకు మొత్తం నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4,31,13,413కు చేరుకుంది. అలాగే, 4,25,70,165 మంది ఈ వైరస్ నుంచి కోలుకోగా, 5,24,181 మంది చనిపోయారు. 

అన్నీ చూడండి

Rukmini Vasanth: రుక్మిణి వసంత క్యాజువల్ ప్యాకింగ్ క్లిప్ అభిమానుల ప్రశంసలు

Charan: డ్రైవింగ్ త్రూ పెద్ది మెమరీస్ పంచుకున్న రామ్ చరణ్, బుచ్చిబాబు

Virat Karna: నాగబంధం పోస్ట్-ప్రొడక్షన్ - విఎఫ్ఎక్స్ పనుల్లో బిజీ

Vadde Naveen: వడ్డే నవీన్ నటిస్తూ నిర్మించిన చిత్రం ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు

Chiru 158: రెగ్యులర్ షూటింగ్ లో చిరంజీవి 158వ చిత్రం

తర్వాతి కథనం
Show comments