దేశంలో కొత్తగా మరో 16 వేల కరోనా పాజిటివ్ కేసులు

సోమవారం, 1 ఆగస్టు 2022 (11:21 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిలో హెచ్చు తగ్గుల్లో కనిపిస్తుంది. తాజాగా మరో 16 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 16112 మంది ఈ వైరస్ బారినపడ్డారు. అలాగే, 39 మంది చనిపోయినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఆదివారం ప్రకటించిన కేసుల కంటే సోమవారం 3 మేరకు కేసులు తగ్గడం గమనార్హం. 
 
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న క్రియాశీల కేసులు 1,43,989(0.33శాతం)కి చేరాయి. ఇప్పటివరకూ 4.40 కోట్ల మందికి కరోనా సోకగా.. 98.48 శాతం మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. 5.26 లక్షల మంది మృత్యుఒడికి చేరుకున్నారు. అలాగే, ఆదివారం 8.34 లక్షల మంది టీకా తీసుకోగా.. మొత్తంగా 204 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. 

అన్నీ చూడండి

Rashi: ది రెడ్ బ్యాగ్ చిత్రంలో సావిత్రి అనే పవర్ ఫుల్ పాత్రలో రాశీ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ సినిమాకు సుధీర్ జోకర్ అనే టైటిల్ ఖరారు

Peddi trailer: మూడు విభిన్న క్రీడలతో హీరోగా ఎదిగిన కథతో పెద్ది ట్రైలర్

Seiyaan: శివకార్తికేయన్, కమల్ హాసన్ చిత్రం సెయాన్ నేడు ప్రారంభం

సినిమా బండి త‌ర్వాత నటుడిగా కెరీర్ పూర్తిగా మారింది: రాగ్ మ‌యూర్‌

తర్వాతి కథనం
Show comments