1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 ఆగస్టు 2022 (08:23 IST)

వెయిట్‌లిఫ్టింగ్‌‍లో పతకాల పంట్.. భారత్ ఖాతాలో మరో పసిడి

Achinta Sheuli
బర్మింగ్‌హామ్ వేదికకగా జరుగుతున్న కామన్వెల్త్ భారత క్రీడాకారులు తమ సత్తా చూపుతున్నారు. ముఖ్యంగా వెయిల్ లిఫ్టింగ్ పోటీలో వారు అమితంగా రాణిస్తున్నారు. దీంతో భారత్ ఖాతాలోకి పతకాలు వచ్చి చేరుతున్నాయి. తాజాగా మరో బంగారు పతకం వచ్చింది. రికార్డు స్థాయిలో 313 కేజీల బరువు ఎత్తిన అచింత షూలి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో భారత్ ఖాతాలో మొత్తం పథకాలు ఆరుకు చేరగా, 52 పతకాలతో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో నిలిచింది. 
 
తాజాగా బెంగాల్‌కు చెందిన అచింత షూలి గత రాత్రి జరిగిన 73 కేజీల ఫైనల్‌లో మొత్తంగా 313 కేజీలు ఎత్తి స్వర్ణ పతకం సాదిచారు. వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు ఇది మూడో స్వర్ణ పతాకం. స్నాచ్‌లో తొలి ప్రయత్నంలో 137 కేజీలు, రెండో ప్రయత్నంలో 140 కేజీలు ఎత్తిం అచింత మూడో ప్రయత్నంలో కూడా 143 కేజేలు ఎలవోకగా ఎత్తేసి రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత క్లీన్ అండ్ జెర్క్‌లోనూ అదే జోరు కొనసాగించాడు. 
 
తొలి ప్రయత్నంలోనే 166 కేజీల ఎత్తిన అచింత రెండో ప్రయత్నంలోనూ 170 కేజీలు ఎత్తడంతో విఫలమయ్యాడు. అయితే, మూడో ప్రయత్నంలో అంతే బరువు ఎత్తి మొత్తంగా 313 కేజీలతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ కైవసం చేసుకున్నారు. మలేషియాకు చెందిన హిదాయత్ 303 కేజలతో రజతం సొంతం చేసుకున్నాడు.