దేశంలో గణనీయంగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు

ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (10:01 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గాయి. గతంలో కంటే ఇపుడు ఈ సంఖ్య బాగా తగ్గింది. తాజాగా వెల్లడైన బులిటెన్ మేరకు.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 28,591 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,32,36,921కు చేరింది. 
 
వీటిలో 3,24,09,345 మంది బాధితులు కరోనా నుంచి బయటపడగా, ఇంకా 3,84,921 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 4,42,655 మంది బాధితులు వైరస్‌ వల్ల మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే, గత 24 గంటల్లో 34,848 మంది కరోనా నుంచి కోలుకున్నారని, కొత్తగా 338 మంది మృతిచెందారని తెలిపింది.
 
ఇకపోతే, కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా, ఇప్పటివరకు 73,82,07,378 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది. ఇందులో ఒకేరోజు 72,86,883 మందికి వ్యాక్సినేషన్‌ చేసినట్టు తెలిపింది. దేశంలో కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో ఒక్క కేరళ రాష్ట్రంలోనే 20,487 కేసులు ఉన్నాయని, 181 మంది మరణించారని తెలిపింది.

అన్నీ చూడండి

RC17: రామ్ చరణ్, సుకుమార్ RC17 యాక్షన్ థ్రిల్లర్ గా సిద్ధమవుతోంది !

Varun Tej : కొరియన్ కనకరాజు పాట విడుదలకి భారీ జనసందోహం

ధృవ్ విక్రమ్‌తో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Niharika: తొమ్మిది కోట్ల బడ్జెట్, ఓటీటీ తిరస్కరణ, నెగెటివ్ టాక్.. వెరసి కమిటీ కుర్రోళ్లు కు జాతీయ అవార్డ్

Ambika Krishna :సినిమాల్లో తెలుగు భాష కనుమరుగవుతుందని వేదన చెందిన అంబికా కృష్ణ .ఎందుకని?

తర్వాతి కథనం
Show comments