Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా మరో 31 వేల పాజిటివ్ కేసులు

Written By ఠాగూర్
Updated: మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (11:37 IST)
దేశంలో కొత్తగా మరో 31 వేల పైచిలుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు... గత 24 గంటల్లో కొత్తగా 31,222 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 
 
దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,30,58,843కి చేరింది. అలాగే, నిన్న 42,942 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. దేశంలో క‌రోనాతో మ‌రో 290 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,41,042కి పెరిగింది. 
 
మరోవైపు, ఈ వైరస్ బారినపడి ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3,22,24,937కు చేరింది. మరో 3,92,864 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందిస్తున్నారు. 
 
అలాగే, దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 69,90,62,776 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. మరోపక్క, నిన్న ఒక్క‌ కేర‌ళ‌లోనే 19,688 కేసులు న‌మోదు కాగా, ఆ రాష్ట్రంలో నిన్న‌ 135 మంది ప్రాణాలు కోల్పోయారు.

అన్నీ చూడండి

ప్రదీప్ రావత్ అంత్యక్రియలకు హాజరైన అమీర్ ఖాన్, అశుతోష్ గోవారికర్

మగవాడికి కమిట్‌మెంట్ ఇవ్వనిదే సినిమా ఛాన్సే కాదు సీరియల్ ఛాన్స్ కూడా రాదు, యువతి వీడియో వైరల్

Genelia Deshmukh: అభిమానుల ప్రేమతో 39వ పుట్టినరోజు జరుపుకున్న జెనీలియా దేశ్‌ముఖ్

Jayam Ravi: భార్యతో విడాకులు.. వడ్డీ కాసుల వాడిగా జయం రవి

Anand Deverakonda :బీచ్ పోస్టర్‌తో ఆనంద్ దేవరకొండ... ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్ డేట్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments