మంగళవారం, 24 సెప్టెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 సెప్టెంబరు 2024 (11:40 IST)

ఆప్ఘనిస్థాన్ భలే రికార్డ్.. కోహ్లీ రికార్డును సమం చేసిన గుర్బజ్..

Gurbaz
Gurbaz
షార్జా వేదిక‌గా శుక్ర‌వారం జ‌రిగిన రెండో వ‌న్డేలో దక్షిణాఫ్రికాపై ఆప్ఘనిస్థాన్ రికార్డ్ విజ‌యాన్ని సాధించింది. క్రికెట్‌లో ప‌సికూన ఆప్ఘనిస్థాన్ చ‌రిత్ర‌ను సృష్టించింది. తొలిసారి సౌతాఫ్రికాపై వ‌న్డే సిరీస్‌ను నెగ్గింది. 
 
177 ప‌రుగుల‌తో తేడాతో సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌లో రెండు వ‌న్డేల్లో గెలిచిన ఆప్ఘనిస్థాన్ 2-0 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. శుక్ర‌వారం జ‌రిగిన రెండో వ‌న్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్థాన్ యాభై ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు మాత్ర‌మే న‌ష్ట‌పోయి 311 ప‌రుగులు చేసింది. 
 
ఓపెన‌ర్ ర‌హ్మ‌తుల్లా గుర్భాజ్ అద్భుత సెంచ‌రీతో అద‌ర‌గొట్టాడు. 110 బాల్స్‌లో ప‌దిఫోర్లు, మూడు సిక్స‌ర్ల‌తో105 ప‌రుగుల చేశాడు. ఈ మ్యాచ్‌లో సెంచ‌రీ సాధించిన ర‌హ్మ‌తుల్లా గుర్భాజ్... టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ కోహ్లి రికార్డ్‌ను స‌మం చేశాడు. 
 
23 ఏళ్ల వ‌య‌సులోపే వ‌న్డేల్లో ఎక్కువ‌ సెంచ‌రీలు చేసిన క్రికెట‌ర్‌గా కోహ్లితో పాటు స‌మంగా నిలిచాడు. తదనంతరం 312 ప‌రుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ దిగిన సౌతాఫ్రికా 34. 2 ఓవ‌ర్ల‌లో 134 ప‌రుగుల‌కు ఆలౌటైంది. కెప్టెన్ బ‌వుమా 38 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు.
 
వ‌న్డేల్లో ఆప్ఘనిస్థాన్ అతి పెద్ద గెలుపును తన ఖాతాలో వేసుకుంది. 2018లో జింబాబ్వేపై 154 ప‌రుగుల‌తో విజ‌యం సాధించింది. ఆ రికార్డ్‌ను సౌతాఫ్రికా మ్యాచ్‌తో ఆప్ఘన్ తిర‌గ‌రాసింది.