1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 31 జనవరి 2015 (11:03 IST)

వరల్డ్ కప్ అనేది మర్చినట్టున్నారు.. ధోనీ..?: గవాస్కర్

ఆస్ట్రేలియాతో జరిగిన ట్రై సిరీస్‌లో టీమిండియా వైఫల్యంపై సునీల్ గవాస్కర్ మండిపడ్డారు. ముక్కోణపు టోర్నీలో ప్రణాళికలు అమలు చేయడంలో ధోనీ వైఫల్యం చెందాడని గవాస్కర్ తెలిపారు. 
 
ధోనీ ప్రణాళికలు చాలా నాసిరకంగా ఉన్నాయని అభిప్రాయపడిన ఆయన, రానున్నది ప్రపంచకప్ అని టీమిండియా మర్చిపోయినట్టుందని గవాస్కర్ తెలిపారు. టీమిండియా ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీ తన బౌలింగ్ తో ఆకట్టుకున్నప్పటికీ, ధోనీ అతన్ని సరిగా వినియోగించుకోలేదని పేర్కొన్నారు.
 
ఎనిమిది ఓవర్లలో మూడు వికెట్లు తీసిన ఆటగాడి కోటాను ధోనీ పూర్తి చేయనివ్వలేదని గవాస్కర్ వెల్లడించారు. ఆశావాదినని పేర్కొన్న గవాస్కర్, టీమిండియా ఓటమి పాలుకావడం తీవ్రంగా కలచి వేసిందని అన్నారు.