Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియా గెలవాలని ప్రార్థిస్తున్న పాక్ జట్టు... ఎందుకు?

Written By మోహన్
Updated: శుక్రవారం, 28 జూన్ 2019 (17:05 IST)
ప్రపంచకప్‌లో లీగ్ మ్యాచ్‌లు చివరి దశకు చేరుకున్నాయి. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా జట్టు మాత్రమే 12 పాయింట్‌లతో సెమీఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. భారత్ మరియు న్యూజిలాండ్ జట్లు సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. అయితే న్యూజిలాండ్ జట్టు ఇప్పటికే 7 మ్యాచ్‌లు ఆడింది. అందులో 5 మ్యాచ్‌లలో నెగ్గింది, 1 మ్యాచ్‌లో ఓడింది, 1 మ్యాచ్ వర్షం కారణంగా డ్రా అయింది. 
 
మరోపక్క భారత్ 6 మ్యాచ్‌లు ఆడింది, అందులో 5 విజయాలు సాధించగా, 1 మ్యాచ్ రద్దయింది. ఇక నాలుగో స్థానానికి మిగిలిన జట్లు పోటీ పడుతున్నాయి. ఇంగ్లండ్ 7 మ్యాచ్‌ల్లో 4 గెలిచింది, బంగ్లాదేశ్ మరియు పాకిస్థాన్ జట్లు 7 మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్‌ల్లో గెలిచాయి. అయితే సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ జట్లన్నీ మిగతా మ్యాచ్‌లను తప్పనిసరిగా గెలవాలి. 
 
పాకిస్థాన్ 1992 సంవత్సరం వరల్డ్‌కప్ రిపీట్ అవుతుందని ఆశిస్తోంది. అయితే ఇప్పుడు మాత్రం భారత్ చేతిలో బంగ్లా ఓడిపోతే, తమకు సెమీస్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయని పాక్ భావిస్తోంది. భారత్ ఇంకా ఇంగ్లండ్, బంగ్లాదేశ్ మరియు శ్రీలంక దేశాలతో మ్యాచ్ ఆడాలి. వీటిల్లో కనీసం ఒకటి గెలిచినా భారత్ సెమీస్‌లో ఆడుగుపెడుతుంది. 
 
మరోవైపు పాకిస్థాన్ జట్టు ఆప్ఘనిస్థాన్ మరియు బంగ్లాదేశ్ జట్లతో మ్యాచ్‌లు ఆడాలి. రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించితే సెమీస్ అవకాశాలు ఉంటాయి. బంగ్లాదేశ్ టీం బాగా రాణిస్తుండడంతో పాకిస్థాన్ కాస్త ఆలోచనలో పడింది. భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగే మ్యాచ్‌లో భారత్ గెలిచిందంటే వారికి సెమీస్ అవకాశం మెరుగ్గా ఉంటుందని పాక్ భావిస్తుంది. 
 
కొంతమంది పాక్ క్రికెటర్లు ఇప్పటికే భారత్ బంగ్లాదేశ్ చేతిలో కావాలనే ఓడిపోతుందని వ్యాఖ్యలు చేస్తున్నారు. అలా జరిగిందంటే పాక్ సెమీస్ ఆశలు గల్లంతు అవుతాయని వారు భావిస్తున్నారు. అందుకే భారత్ గెలవాలని పాక్ క్రికెటర్లు ప్రార్థిస్తున్నారట.

అన్నీ చూడండి

డోనాల్డ్ ట్రంప్‌కు కొత్త చిక్కు - సుంకాలపై కోర్టుకెక్కిన 25 రాష్ట్రాలు

ఆగష్టు 4, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

కుక్కను నిలబెట్టిన గెలుస్తామన్న బీజేపీ - చిత్తుచిత్తుగా ఓడించిన ఓటర్లు

అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నారనీ అత్త, భర్తపై విష ప్రయోగం..

కర్నాటకలో కాంగ్రెస్ పార్టీకి భారీ దెబ్బ, రాజీనామా బాటలో 10 మంది ఎమ్మెల్యేలు?!!

అన్నీ చూడండి

2027 మార్చి నాటికి వెయ్యికి పైగా ఒరిజినల్ మైక్రో డ్రామాలు, మీ ఫోనుల్లోనే ఇక స్టోరీ టీవీ

సీఎం విజయ్‌కి వున్న ఒకే ఒక్క టెన్షన్ అనగానే త్రిష... త్రిష అంటూ నినాదాలు, ఎక్కడ?

బాలీవుడ్‌లో నచ్చే పాత్రలు రావడం లేదు : హీరో సిద్ధార్థ్

సారీ సాయిపల్లవీ, నీకంటే నీ పక్కనే వున్నామే సీతగా బాగుంటుంది, ట్రోల్స్

చెన్నై లవ్ స్టోరీ విజయం ప్రేక్షకుల ప్రేమ, పరిశ్రమ ప్రశంసలే - రవి నంబూరి సత్తా

తర్వాతి కథనం
Show comments