శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Modified: గురువారం, 27 జూన్ 2019 (22:21 IST)

125 పరుగుల భారీ తేడాతో భారత్ 6వ విజయం... 4 వికెట్లు పడగొట్టిన షమీ

ప్రపంచ కప్ 2019 పోటీల్లో భారత్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకూ ఆడిన ఆరు మ్యాచుల్లోనూ తన విజయ పరంపర సాగించింది. తాజాగా వెస్టిండీస్ పైన ఆడిన మ్యాచ్‌లో 125 పరుగుల తేడాతో ఆ జట్టును ఓడించి ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. 
 
269 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ బ్యాట్సమన్లను భారత్ బౌలర్లు వెన్ను విరిచారు. మహ్మద్ షమీ ఏకంగా 4 వికెట్లు పడగొట్టి విండీస్ ఆటగాళ్లను కోలుకోలేని దెబ్బ తీశాడు. బుమ్రా 2 వికెట్లు, చాహల్ 2, పాండ్యా 1, యాదవ్ 1 వికెట్ తీశారు. ఇక విండీస్ ఆటగాళ్లలో చెప్పుకోదగ్గ స్కోరూ ఎవ్వరూ చేయలేకపోయారు. 
 
ఆంబ్రిస్ 31, పూరన్ 28 మినహా మిగిలినవారంతా అత్యంత స్వల్ప స్కోరుకే ఔటయ్యారు. దీనితో వెస్టిండీస్ 34.2 ఓవర్లకే ఆలౌట్ అయి కేవలం 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ మరో ఇంకా మూడు మ్యాచ్ లు ఆడాల్సి వుంది. మరొక్క మ్యాచ్ లో గెలిస్తే సెమీ ఫైనల్ బెర్త్ ఖాయం.