Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ : భారత్ ఆధిక్యం 144 రన్స్ - ఆదుకున్న జడేజా

Written By ఠాగూర్
Updated: శుక్రవారం, 10 ఫిబ్రవరి 2023 (20:08 IST)
నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ క్రమంగా పట్టు సాధిస్తుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 144 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఏడు వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. ప్రస్తుతం రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లు క్రీజ్‌లో ఉన్నారు. వీరిద్దరూ అర్థ సెంచరీలు చేయడం గమనార్హం. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుని తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన భారత్... రెండో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. బ్యాటింగ్‌కు కష్టసాధ్యమైన ఇక్కడి పిచ్‌పై ప్రస్తుతానికి భారత్‌కు 144 పరుగులు కీలకమైన ఆధిక్యం లభించింది. రవీంద్ర జడేజా 66, అక్షర్ పటేల్ 52 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 
 
గాయం నుంచి కోలుకుని దాదాపు ఆరు నెలల తర్వాత మైదానంలో దిగిన రవీంద్ర జడేజా... అద్భుతంగా బౌలింగ్ చేసి ఐదు వికెట్లు నేలకూల్చాడు. అలాగే, బ్యాటింగ్‌లోనూ రాణించి 66 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అక్షర్ పటేల్‌తో కలిసి విలువైన భాగస్వామ్యాన్ని అందించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో టాడ్ మర్ఫీ 5, కెప్టెన్ పాట్ కమిన్స్ 1, నాథన్ లైయన్ 1 చొప్పున వికెట్ తీశారు. 

అన్నీ చూడండి

మమతా బెనర్జీ కారుపై దాడి - వీడియో వైరల్

ఫిట్నెస్ సీక్రెట్‌ను వెల్లడించిన రాహుల్ గాంధీ

అద్దెకు బాయ్‌ ఫ్రెండ్‌ ప్రకటనలపై హైదరాబాద్ సీపీ స్ట్రాంగ్ వార్నింగ్

నకిలీ గుర్తింపు కార్డుతో 25 వివాహాలు చేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే అల్లుడు

ఆరిజోనాలో ప్రియురాలి హత్య : జర్మనీలో ప్రియుడి అరెస్టు

అన్నీ చూడండి

ఎక్కువ మంది స్టార్లు ఉన్న చిత్రాల్లో నటించేందుకు జంకుతాను : నయనతార

మానసిక ప్రశాంతత కోసం సోషల్ మీడియా గుడ్‌బై... 'ప్రేమలు' బ్యూటీ వెల్లడి

'వారణాసి' నుంచి కీలక అప్‌డేట్ - 'రుద్ర' ఫస్ట్‌లుక్ రిలీజ్

Toxic: trailer: బోల్డ్, రా, వైల్డ్, క్రేజీ, అంశాలతో యష్..కియారా అద్వానీ చిత్రం టాక్సిక్: ట్రైలర్

Allari Naresh: కీలక సన్నివేశాల చిత్రీకరణలో రంభ ఊర్వశి మేనక

తర్వాతి కథనం
Show comments