సీఎల్టీ20: సదరన్పై ముంబై గెలుపు.. చంపేసే వారని పోలార్డ్ కామెంట్!
ఛాంపియన్స్ లీగ్ టీ20 క్వాలిఫయర్స్లో భాగంగా ముంబై ఇండియన్స్ పరువు నిలబెట్టుకుంది. తొలి మ్యాచ్లో ఓడినా.. ఆదివారం సదరన్ ఎక్స్ప్రెస్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది.
162 పరుగుల విజయ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 16.2 ఓవర్లలో వికెట్ కోల్పోయి అలవోకగా చేధించింది. మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ కీరన్ పోలార్డ్ మాట్లాడుతూ ' మా ఫీల్డర్లు మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. మెరుగైన జట్టుతో ఇలా ఆడి ఉంటే మమ్మల్ని చంపేసేవారే. సరైన ప్రదర్శనను చేయకపోవడం వల్ల 160 పరుగులిచ్చాం లేదంటే 120కే కట్టడి చేసేవాళ్లం' అని తెలిపాడు.
ఇకపోతే.. సదరన్తో జరిగిన మ్యాచ్లో 'సిమన్స్ (76 నాటౌట్), మైకెల్ హస్సీ (60) రెచ్చిపోవడంతో 162 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా చేధించగలిగామని పోలార్డ్ చెప్పాడు. సిమన్స్, హస్సీకి థ్యాంక్ అని పోలార్డ్ తెలిపాడు. ఇక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును సిమన్స్ అందుకున్నాడు.