Webdunia - Bharat's app for daily news and videos

Install App

కానిస్టేబుల్ కర్కశం... కన్నతల్లిని కొట్టి చంపేశాడు..

Written By ఠాగూర్
Updated: శుక్రవారం, 29 నవంబరు 2024 (10:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ కానిస్టేబుల్ కిరాతక చర్యకు పాల్పడ్డాడు. కన్నతల్లిని కర్కశంగా కొట్టి చంపేశాడు. కుటుంబ తగాదాలను మనసులో పెట్టుకుని ఆ కిరాతక కానిస్టేబుల్.. కన్నతల్లిపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ వృద్ధ తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ దారుణ ఘటన చిత్తూరు నగరంలో చోటుచేసుకుంది. 
 
స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. చిత్తూరు నగరంలోని దుర్గానగర్ కాలనీ రోసీ నగర్‌కు చెందిన శంకర్ అనే వ్యక్తి కానిస్టేబుల్‌గా పనిచేస్తూ, ఇటీవలే సస్పెండ్ అయ్యాడు. ఈ నేపథ్యంలో తాగుడుకు బానిసైన శంకర్... బుధవారం రాత్రి తన తల్లి వసంతము (63)ను మద్యానికి డబ్బులు అడగగా, ఆమె లేదు అనడంతో ఆమెను శంకర్ కాలితో బలంగా తన్నాడు. ఆపై ఆమెను విచక్షణారహితంగా పిడుగుద్దులతో చితకబాదాడు. 
 
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వసంతమ్మ అస్వస్థతకు గురికావడంతో బంధువులు చికిత్స నిమిత్తం ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. అనంతరం ఆమె పరిస్థితి విషమించడంతో తన స్వగృహానికి తీసుకురాగా మృతి చెందింది. ఈ ఘటపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నెట్టి కంటయ్య వెల్లడించారు. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments