రేపు మరోసారి ఒకే వేదికపై చంద్రబాబు - పవన్ కళ్యాణ్

శుక్రవారం, 4 జనవరి 2019 (13:27 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ధ్య మాట‌లయుద్ధం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఊహించ‌ని విధంగా వీరిద్ద‌రు ఒకే వేదిక పైకి రానున్నారు. అదేంటి.. బాబును తీవ్ర స్థాయిలో విమ‌ర్శించే ప‌వ‌న్.. బాబుతో క‌లిసి ఒకే వేదిక పైకి రానున్నారా అంటూ ఆశ్య‌ర్య‌పోతున్నారా..? కానీ..ఇది నిజంగా నిజం.
 
ఇంత‌కీ విష‌యం ఏంటంటే... పద్మావతి ఘాట్‌లో నిర్వహించే హనుమాన్ చాలీసా కార్యక్రమంలో ఈ ఇద్దరు నేతలు పాల్గొన‌బోతున్నారు. గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో రేపు సాయంత్రం 6 గంటలకు పారాయణం. కొద్దిరోజుల క్రితం మంగళగిరిలో ఆలయ ప్రతిష్ట కార్యక్రమలోఈ ఇద్దరు నేతలు పాల్గొన్నారు. కృష్ణానది తీరం పద్మావతి ఘాట్‌లో రేపు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ విశ్వశాంతి మహాయజ్ఞం జ‌ర‌ుగ‌నుంది. 
 
అవధూత దత్తపీఠం మైసూర్ ట్రస్టీ దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో మహాయజ్ఞం సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమవుతుంది. లక్షమంది భక్తులు ఈ పారాయణంలో పాల్గొంటారు. 900 మీటర్ల పద్మావతి ఘాట్‌లో 30 వరసల్లో భక్తులు కూర్చునేలా ఏర్పాట్లు చేసారు. మ‌రి.. ఈ వేదికపైకి వ‌చ్చిన త‌ర్వాత బాబును చూసి ప‌వ‌న్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఆస‌క్తిగా మారింది.

అన్నీ చూడండి

మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర వీణ పాటకు తమిళనాడు సీఎం విజయ్ స్టెప్పులు, వీడియో

Ghantadi Krishna: నా ఆశ నా శ్వాస సంగీతం, దర్శకత్వంతో రిస్క్ చేశా : ఘంటాడి కృష్ణ

VN Aditya: వినోదభరితంగా మన డాక్టర్ బాబే సినిమా: వీఎన్ ఆదిత్య

Kiran Abbavaram : ఛాట్ బస్టర్స్ గా దూసుకెళ్తున్న చెన్నై లవ్ స్టోరీ మూవీ

Dharma Mahesh : జీ5లో ట్రెండింగ్ టాప్-1గా ధర్మ మహేష్ చిత్రం డ్రింకర్ సాయి

తర్వాతి కథనం
Show comments