సంబంధిత వార్తలు
- 10 మంది సుప్రీంకోర్టు జడ్జిలకు కరోనా, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణకు దగ్గు
- కరోనా అంతానికి సమయం సమీపిస్తుంది : డాక్టర్ సమీరన్ పాండా
- శ్రీహరికోట షార్లో కరోనా కలకలం... ఒకే రోజు 142 పాజటివ్ కేసులు
- కోవిడ్ 19: 138 కోట్ల భారతీయులు 112 కోట్ల డోలో ట్యాబ్లెట్లు మింగేసారు
- సుప్రీంకోర్టులో కరోనా కలకలం : పది మంది జడ్జిలకు కరోనా వైరస్
జస్ట్ 2 కోట్లే తేడా... చైనాను దాటేసి నెంబర్ 1 కానున్న 'అఖండ' భారతదేశం
ప్రపంచంలో భారతదేశానికి వున్న ప్రత్యేకతలు సమ్థింగ్... సమ్థింగ్. యూ ఆర్ ది లీడర్ అని ఇండియాను చాలా దేశాధినేతలు ప్రశంసించారు కూడా. శాంతానికి మారుపేరు. మేధస్సుకు కేరాఫ్ అడ్రెస్ భారత్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో...
ఇక అసలు విషయానికి వస్తే... ప్రపంచ జనాభాలో మన దేశానిది రెండో స్థానం. బహుశా ఈ ఏడాది కావొచ్చు లేదంటే మరో ఏడాది కావచ్చు... ప్రపంచ జనాభా అత్యధికంగా వున్న దేశంగా భారతదేశం అవతరించబోతోంది. చైనాలో 2020 నాటికి 140.21 కోట్ల జనాభాతో వుండగా భారతదేశ జనాభా 138 కోట్లను చేరుకుంది.
జనాభా పెరుగుదలలో భారతదేశ గ్రాఫ్ పైపైకి వెళ్తుంటే... చైనా గ్రాఫ్ కిందకు జారిపోతోంది. ఇదిలాగే సాగితే మరో ఏడాదిలోగా భారతదేశం ఆ విషయంలో చైనాను దాటేయడం ఖాయం. ఇప్పటికే చైనా జనాభాను పెంచుకునేందుకు అక్కడి పౌరులకు రకరకాల తాయిలాలు ప్రకటిస్తోంది. కానీ పెద్దగా ఫలితాలు రావడంలేదు.
