Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లాండ్ కొత్త రాజుకు పట్టాభిషేకం- హ్యారీ వస్తారు.. కానీ మేఘన రాదు..

Written By సెల్వి
Updated: శనివారం, 6 మే 2023 (12:25 IST)
Meghan Markle
ఇంగ్లాండ్ కొత్త రాజుకు పట్టాభిషేకం జరుగనుంది. మే 6వ తేదీన పట్టాభిషేక మహోత్సవం జరగనుంది ఈ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించనున్నట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ ఇప్పటికే ప్రకటించింది. ఎలిజబెత్ II ఇంగ్లాండ్ రాణి.. గత ఏడాది సెప్టెంబర్ 8న ఆయన కన్నుమూశారు. అతని మరణం తరువాత, చార్లెస్ III ఇంగ్లాండ్ కొత్త రాజుగా సింహాసనాన్ని అధిష్టించారు. 
 
ఈ వేడుకలో, రాచ కుటుంబ సంప్రదాయం ప్రకారం, చేతిలో రాజదండం, దండతో చార్లెస్ సింహాసనంపై కూర్చుంటాడు. ఈ వేడుకలో, 2000వేల మంది ప్రముఖులను ఆహ్వానించారు. ఈ పట్టాభిషేకానికి 700 ఏళ్లుగా ఇంగ్లండ్ రాజులు ఉపయోగించిన బంగారు పూతతో కూడిన సింహాసనం సిద్ధమవుతోంది. 
 
ఈ నేపథ్యంలో 8వ తేదీన బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఇక ఈ కార్యక్రమానికి రాచరికాన్ని వదులుకున్న ప్రిన్స్ హ్యారీ.. తన తండ్రి ఛార్లెస్ 3 పట్టాభిషేకానికి ఓ సాధారణ అతిథిగా రానున్నట్లు సమాచారం. ఇక హ్యారీ సతీమణి మేఘన్ రాకపై బకింగ్ హామ్ ప్యాలెస్ ప్రకటన కూడా చేసేసింది. 
 
ఈ కార్యక్రమానికి హ్యారీ వస్తున్నారని, మార్కెల్ మాత్రం హాజరు కావట్లేదని ప్యాలెస్ స్పష్టం చేసింది. ప్రిన్స్ హ్యారీ ఈ పట్టాభిషేకానికి హాజరవుతారని, మేఘన్ మార్కెట్ మాత్రం కాలిఫోర్నియాలోనే వుండిపోతారని తెలిపింది.

అన్నీ చూడండి

నా కుమార్తెకు పెళ్లి చేసే వయసు వచ్చింది.. ఇపుడు నాకు పెళ్లేంటి? : సురేఖావాణి

Rashmika injured : తీవ్రంగా గాయపడ్డ రశ్మిక మందన్న, ఆరు వారాలు విశ్రాంతి

చేతబడులు, క్షుద్ర పూజల నేపథ్యంతో కాళాంకి భైరవుడు

Sudheer : మదర్ సెంటిమెంట్ తో సుధీర్స్ జోకర్, తల్లిగా అభిరామి

క్రైమ్ థ్రిల్లర్ అంశాలతో రంగులు మార్చే మనిషి కకథగా నిరమ్ ట్రైలర్

తర్వాతి కథనం
Show comments