ఉగాది నాడు ఉగాది పచ్చడి తింటూ ఈ శ్లోకాన్ని పఠించాలట..లేకపోతే..?

Written By మోహన్
Updated: శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (16:20 IST)
తెలుగువారి నూతన సంవత్సరాది అయిన ఉగాది పర్వదినాన ‘త్వామష్ఠ శోక నరాభీష్ట, మధుమాస సముద్భవ నిబామి శోక సంతప్తాం మామశోకం సదాకురు’అన్న శ్లోకాన్ని పఠిస్తూ ఉగాది పచ్చడి తినాలని మన శాస్త్రం చెబుతోంది.


మధుమాసంలో వచ్చే  శోక బాధలను మన దగ్గరకు రాకుండా చేసేటటువంటి ఓ నింబ కుసుమమా, నన్ను ఎల్లప్పుడూ శోక రహితుడిగా (బాధలు లేకుండా) చెయ్యమని దేవుడిని కోరటమే ఆ శ్లోకానికి  అర్థం. ఈ పండగకు మాత్రమే ప్రత్యేకంగా తినే పదార్థం ఉగాది పచ్చడి. దీన్నే నింబకుసుమ భక్షణం, అశోక కళికాప్రాశనం అని కూడా అంటారు.
 
ఈ పచ్చడిని తయారు చేయడానికి కొత్త చింతపండు, బెల్లం, మామిడి పిందెలు, వేపపువ్వు, మిరియాలు లేదా కారం లేదా పచ్చిమిర్చి, అరటిపండ్లు..మొదలైన పదార్థాలను ఉపయోగిస్తారు. ఇది షడ్రుచుల సమ్మేళనం.

తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులూ జీవితంలోని బాధ, సంతోషం, ఉత్సాహం, నేర్పు, సహనం, సవాళ్లకు సంకేతాలు. సంవత్సరం పొడవునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలనూ ఒకేలా స్వీకరించాలన్న సందేశాన్ని చెప్పకనే చెబుతుందీ ఉగాది పచ్చడి.

అన్నీ చూడండి

కుమారుడుని తప్పించబోయి ఇరుక్కున్న మాజీ మంత్రి సీదిరి అరెస్టు

కోడిచెరువును పవన్ కబ్జా చేసారన్నవారు ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారో?!!

నీట్ పరీక్షా పత్రాలు మూడుసార్లు లీక్.. ప్రభుత్వం ఎందుకు సైలెంట్‌గా వుంటోంది.. అన్నామలై

సిటీస్ ఆన్ ది రైజ్ 2026: భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కెరీర్ హబ్‌లలో విశాఖపట్నం, విజయవాడ

మన విద్యార్థులకు ఇలా ఎందుకు జరుగుతోంది? రాహుల్ గాంధీ

అన్నీ చూడండి

భక్తుల రద్దీ: గురువారం నాటి SSD టోకెన్లను రద్దు చేసిన టీటీడీ

32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ - సింహాచలంలో భారీ ఏర్పాట్లు

22-07-2026 బుధవారం ఫలితాలు - మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది

విద్యా ప్రతిభకు, జ్ఞాపక శక్తికి హయగ్రీవుని మంత్రం

21-07-2026 మంగళవారం ఫలితాలు- తప్పుచేశామన్న భావం రానీయకండి

తర్వాతి కథనం
Show comments