జ్ఞాపకానికి ‘మాట’ తోడు

బుధవారం, 22 సెప్టెంబరు 2021 (08:42 IST)
మనిషికి మనిషి తోడు. వెంట ఎవరైనా ఉంటే మంచీ చెడూ మాట్లాడుకోవచ్చు. దీంతో మనసు తేలిక పడుతుంది. అంతేనా?.. మెదడు ఆరోగ్యమూ ఇనుమడిస్తుంది.

ఇటీవల వైద్యపత్రిక జామాలో ప్రచురితమైన అధ్యయనం ఇదే పేర్కొంటోంది. మనం చెప్పేది శ్రద్ధగా వినేవారుంటే విషయ గ్రహణ సామర్థ్యం (ఆలోచన, హేతుబద్ధత, జ్ఞాపకశక్తి) క్షీణించే అవకాశం తక్కువగా ఉంటున్నట్టు తేలింది మరి.

మెదడులో అల్జీమర్స్‌ మాదిరి మార్పులున్నా ‘మాట తోడు’ ప్రభావం కనిపిస్తుండటం గమనార్హం. ప్రస్తుతానికి అల్జీమర్స్‌ను నయం చేసే చికిత్స ఏదీ లేదు.

ఈ నేపథ్యంలో అల్జీమర్స్‌ లక్షణాలను నివారించుకోవటానికి, విషయ గ్రహణ సామర్థ్యం త్వరగా క్షీణించకుండా ఉండటానికి తగు జాగ్రత్తలు తీసుకునే అవకాశముందని తాజా అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి.
 
మనదేశంలో సుమారు 50 లక్షల మంది అల్జీమర్స్‌తో బాధపడుతున్నారని అంచనా. ఇది జ్ఞాపకశక్తి, భాష, నిర్ణయాలు తీసుకోవటం, స్వతంత్రంగా జీవించటాన్ని గణనీయంగా దెబ్బతీస్తుంది.

అల్జీమర్స్‌ ప్రధానంగా వృద్ధాప్యంలోనే దాడి చేస్తుంది కాబట్టి 65 ఏళ్ల కన్నా చిన్నగా ఉన్నవారు సామాజిక తోడ్పాటుతో గణనీయమైన ప్రయోజనాన్ని పొందే అవకాశముందని పరిశోధకులు చెబుతున్నారు.

40ల్లో, 50ల్లో ఉన్నప్పుడు మనం చెప్పేది శ్రద్ధగా వినేవారు ఎక్కువగా ఉన్నవారితో పోలిస్తే తక్కువగా ఉన్నవారిలో విషయ గ్రహణ సామర్థ్యం వయసు నాలుగేళ్లు అధికంగా ఉంటోందని వివరిస్తున్నారు.
 
ఈ నాలుగు సంవత్సరాలు చాలా కీలకం. ఎందుకంటే చాలామంది వయసు మీద పడ్డాకే మెదడు ఆరోగ్యాన్ని పెంచుకోవటం గురించి ఆలోచిస్తుంటారు. నిజానికి మెదడు ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడే అలవాట్లను అలవరచుకునే విలువైన సమయం అప్పటికే మించిపోతుంది.

ఇందుకోసం పెద్ద పెద్ద పనులేమీ చేయక్కర్లేదు. మంచి సామాజిక సంబంధాలు కలిగుండటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వంటి చిన్న చిన్న మార్పులైనా గణనీయమైన ప్రభావాన్ని చూపించగలవని పరిశోధకులు చెబుతున్నారు.

అన్నీ చూడండి

నెల్లూరులో నో, ఆన్‌లైన్‌లో మహానాడు, చంద్రబాబు పొదుపు చర్యలు

తమిళనాడు ఎన్నికల ఫలితాలు చూసి నా చెవుల్లో ఊదరకొట్టేస్తున్నారు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వీడియో

ఆస్తమా రోగులకు శుభవార్త - జూన్ 8న చేప మందు ప్రసాదం పంపిణీ

పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ దాటబోయింది... ఇంతలోనే వేగంగా రైలు, వీడియో

ప్రేమించి పెళ్లాడి బిడ్డను కని, ఆ బిడ్డను అమ్మేసి మరొకరితో పెళ్లికి సిద్ధమైన వివాహిత

అన్నీ చూడండి

ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే కొత్త పోస్టర్

Sureshbabu: నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల సమస్యలకు సబ్ కమిటీ ఏర్పాటు

Peddi : పెద్ది నుంచి శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ ఫెరోషియస్ లుక్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments