భోజనం చేసే సమయంలో చల్లటి నీటిని తాగవచ్చా..?

శుక్రవారం, 31 మే 2019 (16:05 IST)
మంచి నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. రోజులో వీలైనంత వరకు నీటిని తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. దీంతో చాలా మంది నీటిని ఎక్కువగా తాగుతుంటారు. అందులోనూ చాలా చల్లగా ఉండే నీటిని తాగేందుకు ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా ఎండకాలంలో అయితే దాహంగా ఉందని ఫ్రిజ్‌లో నుండి తీసిన నీటిని, అలాగే గడ్డకట్టిన నీటిని తాగుతుంటారు. 
 
ఇలా మరీ చల్లగా ఉండే నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. వేడి నీటి వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. అదే చల్లటి నీరు అయితే చర్మ రంధ్రాలు మూసుకుపోతుంటాయి. మామూలుగా చల్లటి నీటిని తాగడం వల్ల జీర్ణాశయం కుచించుకుపోతుంది. అంతేకాదు చల్లటి నీరు జీర్ణమై రక్తంలో కలిసే వేగం తగ్గుతుంది. దీని కారణంగా ఒక్కోసారి డీహైడ్రేషన్‌కి గురవుతుంటాం. 
 
భోజనం చేస్తున్నప్పుడు లేదా తిన్న తర్వాత చల్లటి నీటిని తాగడం వల్ల ఆహారంలోని కొవ్వుపదార్థాలు గడ్డకట్టుకుపోతాయి. దీంతో జీర్ణాశయం స్థాయికి మించి పని చేయవలసి ఉంటుంది. కాబట్టి చల్లటి నీటి కంటే గోరువెచ్చని నీటిని తాగడానికే ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గడమే కాకుండా బరువు తగ్గడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.

అన్నీ చూడండి

సీన్ రివర్స్: ప్రియుడు డబ్బులివ్వలేదు.. భర్త సాయంతో చంపి డ్రమ్ములో కుక్కి డ్రైన్‌లో పడేసింది

బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు : బాధితురాలి వాంగ్మూలం నమోదు

ఇంట్లో ఇల్లాలు, ఆసుపత్రిలో ప్రియురాలు, విజయవాడ వైద్యుడి నిర్వాకం

తమిళనాడులో మంత్రులకు శాఖల కేటాయింపు.. సీఎం విజయ్‌ వద్దే హోంశాఖ

గ్వాలియర్‌లో కిడ్నాప్ చేసి... బెంగుళూరులో గ్యాంగ్ రేప్...

అన్నీ చూడండి

నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు, నా ఇగో హర్ట్ అయ్యింది: సూపర్ స్టార్ రజినీకాంత్, వీడియో

Kenisha: జయం రవి, గాయని కెనీషా మధ్య రిలేషన్‌షిప్‌ కట్

Nag Aswin: సింగీతం గారి స్టయిల్ లో సింగ్ గీతం ఫన్ సినిమా :నాగ్ అశ్విన్

Regina Cassandra: ప్రేమ, ద్రోహం, ప్రతీకారంతో నిండిన కథగా మరీచిక ట్రైలర్

చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో సహా 350కి పైగా టైటిల్స్‌ని డిజైన్ చేశా : పురుష: దర్శకుడు వీరు వులవల

తర్వాతి కథనం
Show comments