Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలేయం పువ్వు లాంటిది.. రాత్రి 8 గంటలకు తర్వాత భోజనం చేశారో?

ఉదయం, మధ్యాహ్నం కడుపు నిండా తినండి. కానీ రాత్రి పూట 8 గంటలకు తర్వాత ఆహారాన్ని అస్సలు ముట్టుకోవద్దని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. రాత్రి ఎనిమిది గంటలకు తర్వాత తీసుకునే ఆహారం కాలేయానికి ఇబ్బందిని తెచ్చ

Written By selvi
Updated: శనివారం, 10 ఫిబ్రవరి 2018 (15:31 IST)
ఉదయం, మధ్యాహ్నం కడుపు నిండా తినండి. కానీ రాత్రి పూట 8 గంటలకు తర్వాత ఆహారాన్ని అస్సలు ముట్టుకోవద్దని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. రాత్రి ఎనిమిది గంటలకు తర్వాత తీసుకునే ఆహారం కాలేయానికి ఇబ్బందిని తెచ్చిపెడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాలేయం ఓ పువ్వులాంటిదని... లేటుగా ఆహారం తీసుకుంటే పువ్వులాంటి కాలేయం దెబ్బతింటుందని.. తద్వారా అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
ఒక వేళ ఎనిమిది గంటలకు తర్వాత ఆకలేస్తే ఓ రెండు అరటి పండ్లు పాలు తీసుకుని నిద్రించాలే తప్ప.. 8 గంటలకు తర్వాత ఫుల్ మీల్స్ లాగిస్తే మాత్రం కాలేయానికి ముప్పు తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం పూట అల్పాహారాన్ని 8.30 గంటల్లోపు, మధ్యాహ్నం పూట భోజనాన్ని ఒంటి గంటలోపు పూర్తి చేయడం ద్వారా బరువు పెరగరు.
 
ఇంకా గంటల పాటు కంప్యూటర్ల ముందు కూర్చునే ఉద్యోగమైతే తప్పకుండా గంటపాటు వ్యాయామం చేయాల్సిందేనని.. అలాకాకుంటే ఒబిసిటీ, మధుమేహం వంటి వ్యాధులు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
అలాగే రాత్రి పూట లేకుంటే తరచు వేపుడు పదార్థాలు, మైదా వంటలు, ఊరగాయలు తినడం మానేయాలని, రాత్రి ఆహారంలో యాభై శాతం పచ్చి కూరగాయలు, పళ్లు తీసుకోవాలి. ఇంకా అధిక బరువు, మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారు రాత్రి ఆహారంలో అన్నం కాకుండా గోధుమ పుల్కాలు, జొన్న రొట్టెలు తీసుకోవడం ఉత్తమమని, ఉప్పు, పంచదార మితంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

అన్నీ చూడండి

ఏపీలో వైకాపా నేతల పాపం పండుతోంది... కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే అరెస్టు

ఉదయనిధి సభలో త్రిష నినాదాలు - నీళ్లు అక్కడికే చేరాలంటూ కామెంట్స్... టీవీకే నేతల ఫైర్

సహజీవనం చేసే మహిళను వేధిస్తే ఇక జైలే : సుప్రీంకోర్టు

డోనాల్డ్ ట్రంప్‌కు కొత్త చిక్కు - సుంకాలపై కోర్టుకెక్కిన 25 రాష్ట్రాలు

ఆగష్టు 4, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

అన్నీ చూడండి

డీప్‌ఫేక్ ఫోటోలు తక్షణం తొలగించండి.. లేదా చట్టపరమైన చర్యలు : మృణాల్ ఠాకూర్

Rashmika responds :గాయాలు కావడం మూడోసారి, దేవుడే రెస్ట్ తీసుకోమన్నాడు : రశ్మిక మందన్న

2027 మార్చి నాటికి వెయ్యికి పైగా ఒరిజినల్ మైక్రో డ్రామాలు, మీ ఫోనుల్లోనే ఇక స్టోరీ టీవీ

సీఎం విజయ్‌కి వున్న ఒకే ఒక్క టెన్షన్ అనగానే త్రిష... త్రిష అంటూ నినాదాలు, ఎక్కడ?

బాలీవుడ్‌లో నచ్చే పాత్రలు రావడం లేదు : హీరో సిద్ధార్థ్

తర్వాతి కథనం
Show comments