గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేస్తున్నారా..?

సోమవారం, 18 మార్చి 2019 (17:47 IST)
కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్స్ వంటివాటితో పాటు టెక్నాలజీ బాగా పెరిగిపోవడంతో శరీరానికి శ్రమ తగ్గిపోయింది. కానీ కంటికి శ్రమ ఎక్కువైపోయింది. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవడంతో పాటు చేతుల్లో స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో కంటికి శ్రమ పెరిగిపోవడంతో పాటు కంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఇలాంటి సమస్యల నుండి బయటపడేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 
ఎక్కువ సమయం కంప్యూటర్‌ ముందు కూర్చుని పనిచేసేవారు ప్రతి 20 నిమిషాలకోసారి కొన్ని సెకన్లపాటు విరామం తీసుకుని ఓ 20 అడుగుల దూరంలో ఉన్న ఏదో ఒక వస్తువుని చూడాలి. అలా చేయడం ద్వారా కళ్ళు నీరుకారడం, ఎర్రబారడం, దురద మంట రావడం, పొడిబారడం వంటి సమస్యలను అధిగమించవచ్చు. అంతేకాదు పని మధ్యలో కొన్నిసార్లు లేచి 20 అడుగులు నడవడం వలన శారీరక వ్యాయామంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. 
 
అలాగే కంటి కోసం ఆరోగ్యం కోసం పోషకాహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తాజా ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు వారానికి రెండుసార్లు చేపలు.. నెలకోసారి మాంసం తీసుకునే వారిలో కంటి సమస్యలు ఉండవని రోజూ ఒక గ్లాసుడు క్యారెట్ జ్యూస్ సేవిస్తే కంటికి ఎంతో మేలు చేసినవారవుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

అన్నీ చూడండి

సినీ రంగంలో తాగుబోతులు, తిరుగుబోతులే వుంటారు: సినీ పరిశ్రమపై పాశం యాదగిరి దారుణ వ్యాఖ్యలు

సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుల్.. కాంట్రాక్ట్ ఉద్యోగి సేఫ్

విద్యుత్ ట్రాన్స్‌మిషన్ సత్తాపై ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ AI ఆశలు

సరస్వతి పుష్కరాలకు టీఎస్‌టీడీసీ ప్రత్యేక ప్యాకేజీ పర్యటన

సిద్ధరామయ్య సీఎంగా సగకాలం ముగిసింది, ఇప్పుడు డీకె శివకుమార్ మిగిలిన సగకాల సీఎం

అన్నీ చూడండి

PM Modi: ప్రధాని మోదీ పెద్ది గురించి అడిగారు, వెస్ట్ బెంగాల్‌లో యూత్ పెద్ది గెటప్‌తో వచ్చారు: రామ్ చరణ్

Radhya: ది రెడ్ బ్యాగ్ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య లుక్

Satyadev: బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి మేకింగ్ లో సత్యదేవ్

Vadenaveen: వడ్డే నవీన్‌ ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు నుంచి తొలి సాంగ్ ‘టా టా’ను విడుదల

హర్షిత్ రెడ్డి దీవాన మూవీ నుంచి వన్ సైడ్ లవ్ స్టోరీ పాటకు ఆదరణ

తర్వాతి కథనం
Show comments