Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో మెంతుల పొడిని తీసుకుంటే ఎంత మేలు జరుగుతుందంటే?

మెంతులు వంటకాలలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇవి శరీరంలో వేడిమిని తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు చూచిస్తున్నారు. మెంతుల్లో 50 శాతం పీచుపదార్థం ఉండడం వలన చక్కెర వ్యాధికి, రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించు

Written By Kowsalya
Updated: మంగళవారం, 29 మే 2018 (14:06 IST)
మెంతులు వంటకాలలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇవి శరీరంలో వేడిమిని తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మెంతుల్లో 50 శాతం పీచుపదార్థం ఉండడం వలన చక్కెర వ్యాధికి, రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించుటకు సహాయపడుతుంది. మెంతులు ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే ఇలాంటి వ్యాధులనుండి దూరంగా ఉండవచ్చును.
 
మెంతుల్ని తీసుకోవడంతో పాటు రోజూ అరగంట వాకింగ్ చేస్తే బరువు తగ్గుటకు ఉపయోగపడుతుంది. శరీరానికి గల ఉదరసంబంధిత రుగ్మతలు ఏర్పడకుండా మెంతులు సహాయపడుతాయి. ఈ మెంతులకు పొడి చేసుకుని నీటిలో లేదా మజ్జిగలో కలుపుకుని భోజనానికి 15 నిమిషాల ముందు తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది. షురగ్ లెవన్‌ను కంట్రోల్ చేస్తుంది. అలాకాకుంటే వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే వాటిని డ్రైన్డ్ చేసి ఆ మిశ్రమాన్ని చపాతీ, ఇడ్లీ, పొంగల్, పెరుగు, ఉప్మా వీటినన్నింటిలో వేసుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. 
 
తల్లులకు పాల ఉత్పత్తిని పెంచేందకు మెంతులు చాలా ఉపయోగపడుతాయి. దీనిని ఎలా తీసుకోవాలంటే, మెంతులకు నెయ్యిలో వెయించి వాటిని బాగా నూరి ఆ చూర్ణానికి సమానంగా గోధుమ పిండిని కలిపి ఆ మిశ్రమంలో కొద్దిగా చక్కెర కలిపి తీసుకుంటే బాలింతల్లో పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. అలాలేకుంటే మెంతులతో చేసిని కషాయాన్ని, మెంతికూర పప్పును తీసుకుంటే కూడా మంచిది.
 
ఈ మెంతులను రోజు ఆహారంలో తీసుకుంటే గ్యాస్ సమస్యలు తొలగి జీర్ణక్రియకు సహాయపడుతాయి. మలబద్దకం తొలగిపోతుంది. నిమ్మరసంలో మెంతుల పొడిని కలిపి తీసుకుంటే జ్వరం నుంచి విముక్తి చెందవచ్చును. గాయాలకు, పుండ్లకు, తామర, గజ్జి, ఎండవలన కందిపోయి చర్మం వంటి సమస్యలకు మెంతుల పొడిని తీసుకుంటే మంచిది. ఆ మెంతుల పొడిలో కొంచెం నీళ్లుపోసి పేస్ట్‌లా తయారుచేసుకుని మీ చర్మానికి రాసుకుంటే పైన తెలిపిన సమస్యలనుంచి ఉపశమనం పొందవచ్చును.
About Author
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... Read More

అన్నీ చూడండి

రైతులు - టీచర్లను అమానవీయంగా చూశారు.. కేసులు ఎత్తేస్తాం : సీఎం విజయ్

కర్నాటక రైతు బిడ్డకు రూ.46.33 లక్షల వీసా ఉద్యోగ ఆఫర్

షార్ట్ ఫిల్మ్ నటి అమూల్యశ్రీ కేసులో కీలక మలుపు - ప్రధాన నిందితుడు ఆత్మహత్య

జీఎస్‌ఎల్వీ-F17, ఈఓఎస్-05 రాకెట్ల మోడల్స్‌తో తిరుమలలో ఇస్రో ఛైర్మన్ (video)

Sonu Sood: నేపాల్ వరద బాధితులకు అండగా సోనూ సూద్

అన్నీ చూడండి

దశావతారం థీమ్‌తో.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10.. కంటిస్టెంట్లు వీరే..

తెలుగు ప్రజలు మెచ్చే నాయకుడుగా ఎదగాలి : తమ్ముడుకు అన్నయ్య బర్త్‌డే విషెస్

Mamitha Baiju: అరుదైన మైలురాయిని అందుకున్న హీరోయిన్ మమితా బైజు

Anand Devarakonda: ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ నాలుగో పాటగా ‘సబ్‌కో’ విడుదల

రాజ‌మౌళి నిర్మాణంలో ఫాంటసీ చిత్రం డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments